Switch to English

Rudrakshapuram Teaser: ‘రుద్రాక్షపురం’ టీజర్ విడుదల

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

Rudrakshapuram Teaser: ధీక్షిక సమర్పణలో మ్యాక్‌వుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మణి సాయితేజ, వైడూర్య, పవన్ వర్మ రేఖ తారాగణంగా.. ఆర్.కె. గాంధీ దర్శకత్వంలో కొండ్రాసి ఉపేందర్ నిర్మిస్తున్న చిత్రం ‘రుద్రాక్షపురం 3 కి.మీ.’. పక్కా యాక్షన్ థ్రిల్లర్ ఓరియంటెడ్‌ చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ముగించుకుని విడుదలకు సిద్ధమవుతోంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా మేకర్స్ తాజాగా టీజర్‌‌ని విడుదల చేశారు. టాలెంటెడ్ యాక్టర్ వెంకట్ ఈ చిత్ర టీజర్‌ని ఆవిష్కరించి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

టీజర్‌లో.. ‘ఏదో సాధించాలని వెళుతున్నారు.. అనుకోకుండా చావు ఎదురైంది. భయంతో పరుగులు తీస్తే అది వెంటపడింది. చస్తే సమాధికి, బతికితే ఇంటికి.. తిరగబడితే జయం నిశ్చయం అయింది. జయం నిశ్చయం’ అంటూ పవర్ ‌ఫుల్ వాయిస్ ఓవర్‌లో టీజర్ నడవగా.. ఆ వాయిస్‌కి అనుగుణంగా అదిరిపోయే యాక్షన్‌తో ఈ టీజర్‌ ఉంది. యాక్షన్ థ్రిల్లర్‌కి కావాల్సిన కంటెంట్ ఇందులో పుష్కలంగా ఉందనేలా టీజర్‌‌ని కట్ చేశారు.

ఈ టీజర్ విడుదల చేసిన అనంతరం హీరో వెంకట్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో హీరోలుగా నటించిన మణి సాయితేజకు, పవన్ వర్మకు, డైరెక్టర్ ఆర్.కె.గాంధీగారికి, మీడియా సూపర్ హీరోస్ సురేష్ కొండేటి, వీరబాబు, అప్పాజీగార్లకి.. ఇంకా చిత్రయూనిట్ మొత్తానికి నా శుభాకాంక్షలు. టీజర్ చూశాను. చాలా బాగుంది. మంచి యాక్షన్‌తో కూడిన థ్రిల్లర్ ఇదని అనిపించింది. అందరూ ఈ సినిమాని థియేటర్లలో చూసి విజయవంతం చేయండి. మరొక్కసారి నా బెస్ట్ విశెష్‌ని చిత్రయూనిట్‌కి తెలియజేస్తున్నానని అన్నారు.

చిత్ర దర్శకుడు ఆర్.కె. గాంధీ మాట్లాడుతూ.. ‘‘మా ‘రుద్రాక్షపురం 3 కి.మీ.’ చిత్ర టీజర్‌ని ఆవిష్కరించిన హీరో వెంకట్‌గారికి కృతజ్ఞతలు. ఈ సినిమాలో ఆయన కూడా ఓ మెయిన్ రోల్ చేయాల్సి ఉంది. కానీ.. ఆయన బిజీగా ఉండటం కారణంగా కుదరలేదు. ఆయన చేయాల్సిన పాత్రని సురేష్ కొండేటిగారు చేశారు. ఇప్పుడు వెంకట్‌గారి చేతులు మీదుగా ఈ టీజర్ విడుదలవడం చాలా సంతోషంగా ఉంది. జూన్ 23న సినిమాని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాము. ప్రమోషన్స్ కోసం సాంగ్స్, ట్రైలర్ అన్నీ రెడీ అవుతున్నాయి. ఈ సినిమాని థియేటర్లలో చూసి.. ఆశీర్వదించాలని కోరుతున్నాను..’’ అని అన్నారు.

‘సంతోషం’ సురేష్ కొండేటి మాట్లాడుతూ.. ‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి’ సినిమా అప్పటి నుంచి వెంకట్‌తో మంచి పరిచయం ఉంది. మా ఫ్యామిలీకి ఫ్రెండ్. అలాంటిది వెంకట్‌గారు చేయాల్సిన పోలీస్ ఆఫీసర్ పాత్ర నాకు రావడం చాలా అదృష్టంగా ఫీలవుతున్నాను. దర్శకుడు గాంధీ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఆయన నన్ను కలిసి ఇలా పాత్ర చేయాలి అని అడగగానే.. ముందు గెటప్ చూద్దాం.. బాగుంటే తప్పకుండా చేస్తానని చెప్పాను. గెటప్ ఓకే అవడంతో.. ఈ సినిమాలో పోలీస్ అధికారి పాత్రలో తొలిసారి యాక్షన్ సన్నివేశాల్లో కూడా నటించాను. వెంకట్‌గారు చేయాల్సిన పాత్ర అంటే ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో తెలిసిందే. ఆయన చేతుల మీదుగా ఈ టీజర్ విడుదల కావడం చాలా సంతోషంగా అనిపించింది. తప్పకుండా ఈ సినిమా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు.

పీఆర్వో ధీరజ్ అప్పాజీ మాట్లాడుతూ.. అతి త్వరలో అగ్ర దర్శకుడయ్యే లక్షణాలు దర్శకుడు గాంధీలో ఉన్నాయి. అతని దర్శకత్వంలో వెంకట్ హీరోగా ఓ సినిమా ఉండబోతుంది. ఇక ‘రుద్రాక్షపురం 3కి.మీ’ విషయానికి వస్తే.. ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న నిర్మాత ఉపేందర్‌గారి అబ్బాయికి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.

పీఆర్వో వీరబాబు మాట్లాడుతూ.. ఈ సినిమాలో నాకో మంచి పాత్రని ఇచ్చిన గాంధీగారికి, నిర్మాతలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.

చిత్ర హీరో సాయి మణితేజ మాట్లాడుతూ.. టీజర్ విడుదల చేసిన వెంకట్‌గారికి ధన్యవాదాలు. ఈ సినిమాలో అనుకోకుండా నేను హీరోగా చేయడం జరిగింది. ఫస్ట్ లుక్‌ని ప్రకాశ్ రాజ్‌గారు విడుదల చేసిన తర్వాత.. హీరో ఇంకా ఫైనల్ కాలేదు. అప్పుడు నేను దర్శకుడు గాంధీగారికి కనిపించడంతో.. ఆయన ఈ సినిమాలో హీరో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. చాలా మంచి పాత్ర ఇచ్చి ఎంకరేజ్ చేసిన దర్శకుడు గాంధీగారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు. మరో నటుడు పవన్ వర్మ మాట్లాడుతూ.. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు.

నిర్మాత కొండ్రాసి ఉపేందర్ మాట్లాడుతూ.. ఈ సినిమా టీజర్‌ని విడుదల చేసిన వెంకట్‌గారికి ధన్యవాదాలు. ఆయనతో నాకు తెలియని బంధం ఉంది. నా మ్యారేజ్ అయిన కొత్తలో నా భార్యతో కలిసి చూసిన మొట్టమొదటి చిత్రం ఆయన నటించిన చిత్రమే. అందుకే ఆయనలానే నా బిడ్డని హీరోని చేయాలని అప్పుడే ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు నా కుమారుడిని హీరోగా ఈ సినిమాతో పరిచయం చేయడం, చిత్ర టీజర్‌ని వెంకట్‌గారు విడుదల చేయడం.. దైవ సంకల్పంగా భావిస్తున్నాను. ఈ సినిమా కోసం గాంధీగారు చాలా కష్టపడ్డారు. మంచి అవుట్‌ఫుట్ వచ్చింది. నేను ఆల్రెడీ సినిమా చూశాను. ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్లలో చూసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నానని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...