టీఆర్ఎస్ కు వెయ్యి కోట్లు ఆస్తులున్నాయని ప్రకటించిన సీఎం కేసీఆర్.. తన వ్యక్తిగత ఆస్తులెంతో చెప్పాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నారాయణపేట జిల్లా ఉట్కూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ధనిక రాష్ట్రంగా చెప్పుకుంటున్న తెలంగాణలో 4లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి. ప్రభుత్వోద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి కేసీఆర్ కుటుంబం సంపాదించుకుంది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై అసత్యాలు చెప్తున్నారు’.
‘పార్టీ ప్లీనరీ పేరు చెప్పి బీజేపీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. రైతుల ఆదాయం పెంచేలా కేంద్రం చర్యలు తీసుకుంటుంటే విమర్శిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించమంటే విమర్శలు చేస్తున్నారు. దేశానికి మజ్లిస్ క్యాన్సర్ లా మారితే.. ఆ పార్టీనే పక్కన పెట్టుకున్నారు. కేంద్రంలో బీజేపీ 27 మంది బీసీలకు పదవులు ఇస్తే.. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారు. కేసీఆర్ ఆటలు ఇక సాగవు. రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే’ అని అన్నారు.
968773 583542An attention-grabbing discussion is worth comment. I believe that you should write far more on this matter, it wont be a taboo topic nonetheless typically persons are not sufficient to talk on such topics. To the next. Cheers 775824
422555 635546Jane wanted to know though your girl could certain, the cost I merely informed her she had to hang about until the young woman seemed to be to old enough. But the truth is, in which does not get your girlfriend to counteract making use of picking out her quite own incorrect body art terribly your lady are usually like me. Citty design 708631