అది భూస్వామ్యం ముసుగులో కులాధిపత్యం రక్తపుటేరులు పారించిన ఓ రుధిర క్షేత్రం.. తెలుగు నేలపై సామాజిక ఉద్యమాలకు దళితులు తమ నెత్తుటితో అంకురార్పణ చేసిన ఘట్టానికి సాక్షిభూతం. అణగారిని వర్గాలను కదిలించి.. దళిత శక్తులను ఆత్మగౌరవ పతాక కిందకు తీసుకొచ్చిన ఓ దిక్సూచి కారంచేడు
కారంచేడు.. ప్రకాశం జిల్లా చీరాలకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం. 35 ఏళ్ల క్రితం జరిగిన హింసాకాండ కారణంగా కారంచేడు పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. చిన్న తగాదా చినికి చినికి గాలివానగా మారి ఆరుగురు దళితుల ఊచకోతకు కారణమైంది. 1985 జూలై 17న జరిగిన ఆ మారణకాండ ఇప్పటికీ పలువురు కంట్లో అలాగే మెదులుతోంది.
కారంచేడు గ్రామంలో మొత్తం 16 వార్డులు ఉండగా.. 8 వార్డుల్లో ఓ ప్రధాన సామాజికవర్గానికి చెందినవారు ఉండేవారు. మిగిలిన ఎనిమిది వార్డుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గానికి చెందినవారు ఉండేవారు. ప్రధాన సామాజికవర్గానికి చెందినవారు ధనవంతులు కావడంతో ఆ ప్రాంతమంతా వారి చెప్పినట్టే నడిచేది. ఈ క్రమంలో ఆ ఊరి చెరువు వద్ద జరిగిన ఓ ఘటన ఆ మరుసటి రోజు హింసకు దారితీసిందనే వాదనలున్నాయి.
1985 జూలై 16న చెరువు దగ్గర గేదెలకు కుడితె పెట్టే విషయంలో ఓ దళిత యువకుడికి, ప్రధాన సామాజికవర్గానికి చెందిన ఇరువురు వ్యక్తులకు మధ్య చిన్న ఘర్షణ జరిగింది. దీంతో మరుసటి రోజు ఉదయం మారణకాండ చోటుచేసుకుంది. దళితులపై మారణాయుధాలు, కర్రలతో దాడి చేయడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే, వాస్తవంగా చనిపోయింది ఎనిమిది మంది అని.. ఇద్దరి మృతదేహాలను పోలీసులు ఎవరికీ తెలియకుండా సమాధి చేసేశారనే ఆరోపణలున్నాయి.
అనంతరం నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ కత్తి పద్మారావు, బొజ్జా తారకం వంటి నేతలు ఉద్యమం చేపట్టారు. దీంతో సీబీసీఐడీ విచారణ చేపట్టి 90 మందిని నిందితులుగా పేర్కొంది. అయితే, అప్పటి పర్చూరు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు తండ్రి దగ్గుబాటు చెంచురామయ్యపై కేసు నమోదు చేయలేదని ఆరోపిస్తూ కోర్టులో ప్రైవేటు పిటిషన్ దాఖలు చేశారు.
అనంతరం 1989లో చెంచురామయ్యను పీపుల్స్ వార్ హత్య చేసింది. చివరకు వాదోపదానలు విన్న తర్వాత గుంటూరు కోర్టు 1994 అక్టోబర్ 30న తీర్పు వెలువరించింది. ఐదుగురికి జీవితఖైదు, 46 మంది మూడేళ్ల జైలు శిక్ష, 65 ఏళ్లు పైబడిన నలుగురికి రూ.10వేల జరిమానా విధించింది. దీంతో శిక్ష పడినవారంతా హైకోర్టుకు వెళ్లడంతో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద కింది కోర్టు విధించిన శిక్షలకు రద్దు చేస్తూ 1998లో తీర్పునిచ్చింది.
దీంతో బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పదేళ్ల తర్వాత 2008 డిసెంబర్ 19న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అప్పటికే పలువురు నిందితులు మరణించడంతో అంజయ్య అనే వ్యక్తికి జీవితఖైదు, మరో 29 మందికి మూడేళ్ల శిక్ష విధించింది.
ఈ మారణహోమం తర్వాత దళితులు తమ అస్థిత్వం కోసం, హక్కుల కోసం, ఆత్మరక్షణ కోసం పిడికిలి బిగించారు. 1989లో వచ్చిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు దేశవ్యాప్తంగా సాగిన పలు దళిత ఉద్యమాలకు కారంచేడు ఘటనే స్పూర్తి.
దళితుల సమస్యలన్నింటికి పరిష్కారం రాజ్యాధికారమే అన్న రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ నినాదాన్ని దళితుల మెదళ్లలో నింపింది. దళిత కులాల సమస్యలను సమాజంలో, ప్రభుత్వంలో చర్చకు పెట్టింది. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని బతికిన దళితుల్లో కారంచేడు ఘటన తర్వాత ఊహించలేనంతటి మార్పు వచ్చింది
384787 32332Pretty section of content. I just stumbled upon your weblog and in accession capital to assert that I get actually enjoyed account your weblog posts. Any way I is going to be subscribing to your augment and even I achievement you access consistently quickly. 268183
642830 843644Would enjoy to constantly get updated fantastic internet blog ! . 178280