మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ మొదలు అవ్వడంతో షూటింగ్ కు బ్రేక్ వేశారు. రామ్ చరణ్ మరియు సోనూసూద్ లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో పలువురు చిత్ర యూనిట్ సభ్యులకు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అవ్వడంతో షూటింగ్ ను నిలిపి వేశారు. మళ్లీ ఎప్పటికి ఈ సినిమా ప్రారంభం అయ్యేది క్లారిటీ లేదు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది. మరో 15 వర్కింగ్ డేస్ తో ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని అంటున్నారు.
కొరటాల శివ ఈ సినిమా ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని జెట్ స్పీడ్ గా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నా కూడా కరోనా కారణంగా ఆలస్యం అవుతూనే ఉంది. గత ఏడాదిలోనే సినిమా విడుదల చేయాలనుకున్నారు. కరోనా కాస్త తగ్గడంతో మే లో విడుదల చేయాలనుకున్నారు. కాని సెకండ్ వేవ్ వల్ల అసలు ఆచార్య ఈ ఏడాదిలో విడుదల అయ్యే అవకాశం ఉందా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చిరంజీవి మరియు చరణ్ లు ఈ సినిమాలో నటించడం వల్ల అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. సినిమాలో చిరుకు జోడీగా కాజల్, చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటించగా సంగీత కీలక పాత్రలో కనిపించబోతుంది.
513993 380534Specific paid google internet pages offer complete databases relating whilst personal essentials of persons whilst range beginning telephone number, civil drive public records, as well as criminal arrest back-ground documents. 936722
307110 100724Lovely sharp post. Never considered that it was that effortless. Praises to you! 466510
754694 764956Thankyou for all your efforts which you have put in this. quite intriguing information . 605824