ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఏకంగా 117.15 కోట్ల రూపాయలను కొల్లగొట్టేందుకు భారీ కుట్ర జరిగింది. ఏకంగా మూడు రాష్ట్రాల్లో మూడు చెక్కులను వేయడం ద్వారా ఇదో పెద్ద ముఠా అన్నట్లుగా అనుమానం వ్యక్తం అవుతోంది.
ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెందిన చెక్కులను మొదట మంగళూరు, ఆ తర్వాత కోల్కత్తా మరియు ఢిల్లీలో కూడా డిపాజిట్ కు వేయడం జరిగింది. కేవలం రెండు రోజుల వ్యవధిలో సీఎం రిలీఫ్ ఫండ్ కు చెందిన మూడు చెక్కులు అవి కూడా 117 కోట్ల రూపాయల విలువ చేసే చెక్కులు వేయడం తో బ్యాంకు అధికారులకు అనుమానం వచ్చింది.
మంగళూరు బ్రాంచ్ లో వేసిన చెక్కు రూ. 52.65 కోట్లు, కోల్ కత్తాలో వేసిన చెక్కు 25.65 కోట్లు, ఢిల్లీలో వేసిన చెక్కు 39.85 కోట్లు ఉంది. ఒకే సారి మూడు రాష్ట్రాల్లో ఈ చెక్కులు వేయడం వెనుక ఉన్నది ఎవురు. అసలు ఆ చెక్కులు వారికి ఎలా అందాయి అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
సీఎం రిలీఫ్ ఫండ్ కు సంబంధించిన అధికారులు ఏమైనా ఈ విషయంలో ఉన్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ మొదలు పెట్టారు.
485346 942651Reasonably unusual. Is likely to appreciate it for those who add forums or something, website theme . a tones way for your customer to communicate. Excellent task.. 689308
471272 803062Great post, I feel internet site owners should acquire a good deal from this internet web site its extremely user pleasant. 1508
943862 342284You need to join in a tournament first of the greatest blogs on the web. I will recommend this internet internet site! 413233