నేడు వైఎస్సార్ వర్ధంతి. ‘మహానేతకి మహా నివాళి..’ అంటూ వైసీపీ శ్రేణులు, వైఎస్సార్ విగ్రహాల వద్ద పోటెత్తారు. అధిష్టానం మెప్పు కోసం ‘సోషల్ డిస్టెన్సింగ్’ని పక్కన పెట్టేశారు. మాస్క్ల జాడే కన్పించలేదు. పెద్దయెత్తున జన సమీకరణ చేపట్టారు. టెంట్లు వేశారు.. పెద్ద పెద్ద దండలు తీసుకొచ్చారు. అంతేనా.? ఇంకా చాలా చేశారు. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. ‘నువ్వెంత.? నీ బతుకెంత.?’ అంటూ తిట్టుకున్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి.
‘మహా నేత విగ్రహానికి నేనే తొలుత దండ వేసి నివాళులర్పిస్తాను..’ అని ఒక నాయకుడంటే, ‘ఆ ఛాన్స్ నీకెందుకిస్తాను.? అది నా జన్మ హక్కు..’ అని ఇంకో నాయకుడు మీసం మెలేసి, తొడకొట్టేశాడు. ‘మేం మొదటి నుంచీ వైఎస్ జగన్ వెంట వున్నాం.. నువ్వు మధ్యలో వచ్చావ్..’ అని కొందరు నినదిస్తే, ‘మీకు పార్టీలో అంత సీన్ లేదు.. ఇప్పుడు అధిష్టానం మెప్పు మాకే వుంది..’ అని ఇంకొందరు గొడవకు దిగారు. దాంతో, వైసీపీ కార్యకర్తలు ఎవరికి ‘జై’ కొట్టాలో తెలియక గింజుకోవాల్సి వచ్చింది. ‘ఇదెక్కడి చోద్యం..’ అని సాధారణ ప్రజానీకం ముక్కున వేలేసుకున్నారు వైసీపీలో వర్గ పోరుని చూసి.
వైపీపీలోకి ఇటీవలి కాలంలో ఇతర పార్టీల నుంచి చాలామంది నాయకులు చేరిన విషయం విదితమే. అలా చేరినోళ్ళతో, అసలు వైసీపీ నేతలకు అస్సలేమాత్రం పొసగడంలేదు. ఈ పంచాయితీలు ఇప్పటికే పార్టీ అధినాయకత్వం వద్దకు వెళ్ళాయి కూడా. కానీ, పార్టీలో ‘డ్యామేజ్ కంట్రోల్’ చేసేంత తీరిక పార్టీ ముఖ్య నేతలెవరికీ లేకపోవడంతో.. ఆ రచ్చ ఇదిగో ఇప్పుడిలా బయటపడింది. ప్రకాశం జిల్లాలోనూ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ ఈ తరహా వివాదాలు ఎక్కువగా కన్పించాయి. ఉత్తరాంధ్రలోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. ‘
వైసీపీ వాపుని చూసి బలుపుగా భ్రమపడ్తోంది.. ఆ బుడగ పేలిపోవడం ఖాయం..’ అంటూ వైసీపీలో వర్గ విభేదాలపై విపక్షాలు విరుచుకుపడుతుండడం గమనార్హం. కొందరు నేతలైతే, ‘బస్తీమే సవాల్.. మీ సంగతి తేల్చేస్తాం.. లేకపోతే, మేం పార్టీకి దూరమవుతాం..’ అంటూ సవాళ్ళు విసురుకోవడం కొసమెరుపు. వైఎస్సార్ వర్ధంతి నాడు పండగలా పబ్లిసిటీ స్టంట్లు చేద్దామనుకున్న వైసీపీ అధిష్టానానికి.. ఈ గొడవలతో దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయినట్లే వుంది.!
206895 51381Some genuinely fantastic information , Gladiola I detected this. 918536
494805 360107The web site loading speed is incredible. 850411