Switch to English

వైఎస్ జగన్ ‘తాడేపల్లి ప్యాలెస్‌’పై ఎందుకింత రచ్చ.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,758FansLike
57,764FollowersFollow

కాదేదీ, రాజకీయానికి అనర్హం.! ఔను, ఇందులో వింతేముంది.? ఏళ్ళ తరబడి.. కాదు కాదు, దశాబ్దాలుగా చూస్తున్నదే కదా.! కాకపోతే, ఇప్పుడు రాజకీయం మరింత దిగజారిపోయింది.! ఫామ్‌హౌస్‌లో పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు.? లింగమనేని గెస్ట్ హౌస్‌లో చంద్రబాబు ఏం చేస్తున్నారు.? అని ఆరాలు తీసినప్పుడు, ‘తాడేపల్లి ప్యాలెస్’లో జగన్ ఏం చేస్తున్నారు.. అని ఆరా తీయడంలో తప్పేమీ లేదు కదా.!

ప్రజా జీవితంలోకి వస్తే, ఎవర్నయినా ఏమన్నా అంటాం.. అని రాజకీయ నాయకులు చెబుతుంటారు. అలా చెప్పేవాళ్ళని కూడా జనం ఏదో ఒకటి అంటుంటారు కదా.! అలాగే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి కూడా అంటున్నారు, నానా రకాలుగా అనుకుంటున్నారు.!

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, అధికార పీఠమెక్కేముందు.. వైఎస్ జగన్, ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలో సొంత ఇల్లు కట్టుకున్నారు. ఇదే రాజధాని, అందుకే ఇక్కడే ఇల్లు కట్టుకున్నా.. అని కూడా చెప్పారు జగన్. కానీ, అధికారంలోకి వచ్చాక, అమరావతిని ‘కమ్మరావతి’ అని పేర్కొంటూ, ఆ అమరావతి మీద నానా రకాల దుష్ప్రచారమూ చేశారు.

ఇప్పుడేమో అధికారం ఊడింది.! ఇంతకీ, అమరావతిలోని తాడేపల్లిలోగల వైఎస్ జగన్ ఇంట్లో ఏముంది.? ఆ ఇంటికి, అధికారంలో వుండగా, ప్రజాధనంతో దిద్దిన మెరుగులేంటి.? ఇంటి చుట్టూ దాదాపు ముప్ఫయ్ అడుగుల యెత్తున ఆ రక్షణ కవచాలేంటి.? ఇలా ప్రజల మెదళ్ళలో బోల్డన్ని ప్రశ్నలు.

నిజానికి, వైఎస్ జగన్ తాడేపల్లి ప్యాలెస్ అనేది ప్రైవేటు ఆస్తి. అందులోకి తొంగి చూడాలని అనుకోవడం ఎవరికీ తగదు. కాకపోతే, పైన చెప్పుకున్నట్లు.. ‘అందరి జీవితాల్లోకీ వైసీపీ తొంగి చూసిన దరిమిలా, తాడేపల్లి కొంపలోకి కూడా తొంగి చూడాలి కదా..’ అన్నది ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న.

ఆ ప్యాలెస్ చుట్టూ సామాన్యులు తిరగకుండా, రోడ్లను బ్లాక్ చేసి పడేశారు గడచిన ఐదేళ్ళుగా. ఇప్పుడు ఆ రోడ్లు సామాన్యుల రోజువారీ అవసరాల నిమిత్తం తెరచుకున్నాయి కూటమి ప్రభుత్వం పుణ్యమా అని.

అలా అటు వెళ్ళే అవకాశం దక్కిన జనం, అక్కడి ఆ ప్యాలెస్ నిర్మాణాలు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ‘అదిగో, ఆ గేటు.. మనం కట్టిన పన్నులతో నిర్మించుకున్నదే.. ఇదిగో, ఈ రక్షణ కవచానికీ, ప్రజాధనాన్నే వెచ్చించారు..’ అని జనం చర్చించుకుంటున్నారు.

ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో, ఆ ముఖ్యమంత్రి రక్షణ కోసం ప్రభుత్వం ఖర్చు చేసిందేమో.! ఇప్పుడాయన ముఖ్యమంత్రి కాదు, ప్రతిపక్ష నేత కూడా కాదు.! మరి, ఆ ఖర్చుల్ని వెనక్కి తీసుకోవాలి కదా.? అని జనం మాట్లాడుకుంటోంటే, దాన్ని నిలువరించగలమా.?

‘తాడేపల్లి జగన్ ప్యాలెస్ రహస్యం బట్టబయలవ్వాలి.. అక్కడ నేల మాళిగలే వున్నాయో.. ఇంకేమన్నా వున్నాయో.. వందల కోట్లు కాదు, వేల కోట్లు.. లక్షల కోట్లు మగ్గుతున్నాయేమో..’ అన్న చర్చ జనంలో జరిగే పరిస్థితి ఎందుకొచ్చింది. ఈ ప్రశ్నలకు సమాధానం, చంద్రబాబు ప్రభుత్వం చెబుతుందా.? వేచి చూడాలిక.

సినిమా

ఎగ్జిబిటర్ల తీర్మాణం.. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్..

తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు (థియేటర్ల ఓనర్లు) సంచలన నిర్ణయం తీసుకున్నారు. థియేటర్లను అద్దెలతో నడిపించే పరిస్థితి లేదని.. తమకు సినిమాలో పర్సెంటేజీ ఇవ్వాల్సిందే అంటూ తేల్చి...

Ram Charan: గ్లోబల్ స్టార్ కు కితాబిచ్చిన గ్లోబల్ మీడియా

Ram Charan: నేటి రోజుల్లో ఎవరైనా ఫేమస్ కావాలంటే పబ్లిసిటీ ముఖ్యం. సినిమా హీరోలకు మరీ ముఖ్యం. ఏ భాష హీరో అయినా పాన్ ఇండియా...

Ntr-Rajamouli: ఎన్టీఆర్-రాజమౌళిపై దాదాసాహెబ్ ఫాల్కే మనవడి కామెంట్స్ వైరల్..!

Ntr-Rajamouli: భారతీయ సినిమాకు పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ తెరకెక్కించేందుకు బాలీవుడ్ సిద్ధమైంది. అమీర్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుందనే...

‘సింగిల్’ ని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్.. అల్లు అరవింద్

సింగిల్ మూవీని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు అల్లు అరవింద్ స్పెషల్ థాంక్స్ చెప్పారు. శ్రీ విష్ణు హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో...

చిరు-అనిల్ మూవీలో నయనతార ఫిక్స్.. క్రేజీ వీడియో..

మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి మూవీపై రోజుకొక అప్డేట్ ఇస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గురించి ఇప్పటికే చాలా చర్చలు జరిగాయి. చాలా మంది పేర్లు వినిపించాయి....

రాజకీయం

Pawan Kalyan-Lokesh: గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం.. పవన్ కల్యాణ్, లోకేశ్ దిగ్భ్రాంతి

Pawan Kalyan-Lokesh: హైదరాబాద్ నగరం చార్మినార్ ప్రాంతంలోని గుల్జార్ హౌస్ ప్రాంతంలో ఈరోజు ఉదయం ఘోర అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దుర్ఘటనలో 17 మంది మృతి చెందడం.. మృతుల్లో ఇద్దరు చిన్నారులు,...

Nara Lokesh: ప్రధాని మోదీని కలిసిన మంత్రి లోకేశ్.. ‘యువగళం’ పుస్తకం ఆవిష్కరణ

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేశ్ కుటుంబసమేతంగా శనివారంనాడు న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఇటివల ప్రధాని అమరావతి వచ్చిన సందర్భంలో...

పాకిస్థాన్ వాళ్ల ఇళ్లలోకి వెళ్లి కొడుతాం.. పవన్ కల్యాణ్‌ ఫైర్..

పాకిస్థాన్ మన భారతదేశం జోలికి వస్తే వాళ్ల ఇళ్లలోకి వెళ్లి కొడుతాం అని పవన్ కల్యాణ్‌ ఫైర్ అయ్యారు. పాకిస్థాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందని.. అలాంటి వారిని అస్సలు క్షమించకూడదు అంటూ తెలిపారు....

లిక్కర్ స్కామ్: అన్యాయం, అక్రమం.. అంటూ వైసీపీ గగ్గోలు.!

దేశాన్ని కుదిపేసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో అరవింద్ కేజ్రీవాల్ ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. మంత్రి సహా ముఖ్యమంత్రి కూడా జైలుకు వెళ్ళారు....

చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్.. పెట్టుబడుల జోరు..

ఏపీలో పారిశ్రామిక రంగం మళ్లీ పరుగులు పెడుతోంది. గత ఐదేళ్లలో అసలు ఏపీలో పెట్టుబడుల ఊసే లేదు. కేవలం ప్రచారాలకే పరిమితం అయింది వైసీపీ. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ...

ఎక్కువ చదివినవి

నితిన్ ‘తమ్ముడు’ మూవీ జులై 24కు వాయిదా..?

యంగ్ హీరో నితిన్ తమ్ముడు మూవీతో గట్టి హిట్ కొట్టాలనే తాపత్రయంలో ఉన్నాడు. వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ తెరకెక్కించిన తమ్ముడు మూవీకి మంచి హైప్ ఉంది. ఇప్పటికే వచ్చిన టీజర్...

Ntr-Rajamouli: ఎన్టీఆర్-రాజమౌళిపై దాదాసాహెబ్ ఫాల్కే మనవడి కామెంట్స్ వైరల్..!

Ntr-Rajamouli: భారతీయ సినిమాకు పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ తెరకెక్కించేందుకు బాలీవుడ్ సిద్ధమైంది. అమీర్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుందనే వార్త సినీ వర్గాల్లో ఆసక్తి రేపింది....

ఎన్టీఆర్- నీల్ సినిమాలో శ్రద్ధా కపూర్..?

పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్, సంచలన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మూవీ షూటింగ్ కొంతవరకు జరిగింది. మొన్నటిదాకా కర్ణాటకలో షూటింగ్ చేసిన టీం.....

ఆనంద్ దేవరకొండ కొత్త మూవీ ప్రారంభం..

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ కొత్త మూవీ ప్రారంభం అయింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో బేబీ కాంబో రిపీట్ అవుతోంది. ఆనంద్,...

2029 నాటికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇదీ.!

2024 ఎన్నికల్లో వై నాట్ 175 అని నినదించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అధికారాన్ని కోల్పోయింది.. ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. నిజానికి, ఘోర పరాజయంపై వైసీపీ నేతలు ఓ స్పష్టతతోనే వున్నా,...