‘బడ్జెట్ ఘనంగానే వుంది.. కేటాయింపులు బాగానే వున్నాయ్.. కానీ, నిధులు విడుదల చేసే పరిస్థితి వుంటుందా.?’ అనే ప్రశ్న వైసీపీ వర్గాల్లోనే వ్యక్తమవుతోందంటే, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంత గొప్పగా వుందో అర్థం చేసుకోవచ్చు. ‘ఫలానా శాఖకి ఎందుకు నిధులు తగ్గించేశారు.? ఫలానా కార్పొరేషన్ని ఎందుకు పట్టించుకోలేదు.?’ అంటూ పలువురు వైసీపీ ముఖ్య నేతలు, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డికి క్లాస్ తీసుకుంటున్నారట.
‘పదవులు ఇచ్చారు సరే, కేటాయింపులు లేకపోతే ప్రయోజమేంటి.?’ అంటూ ఓ సీనియర్ నేత, బుగ్గన రాజేంద్రనాథ్ తీరుపై గుస్సా అవుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ‘చూద్దాం, వీలైతే కొన్ని మార్చుదాం..’ అనే ప్రతిపాదన ముఖ్యమంత్రి నుంచి రావడం సహజమే. కానీ, అలాంటి సమాధానాలకి సంతృప్తి చెందేలా కన్పించడంలేదు పరిస్థితి.
ఓ పక్క, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, బడ్జెట్పై మండిపడుతూ, వివరణాత్మకంగా బడ్జెట్లోని లోటుపాట్లను ఎత్తి చూపుతోంటే, వాటికి సమాధానమివ్వలేక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మీడియా సాక్షిగా తెలుగుదేశం పార్టీ నేతలపై విరుచుకుపడిపోతున్నారు. తొలి బడ్జెట్ కాబట్టి, అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి వుందనీ, మొదటి బడ్జెట్తోనే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగేలా చేసుకోవడం దురదృష్టకరమనీ, పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ వైసీపీ ముఖ్య నేత ఆఫ్ ది రికార్డ్గా వ్యాఖ్యానించడం గమనార్హం.
దాదాపు 48 వేల కోట్ల రూపాయలు అప్పు చేయాల్సిన పరిస్థితి తొలి బడ్జెట్తోనే వస్తే, ముందు ముందు పరిస్థితి ఇంకెలా వుంటుందోనని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘చంద్రబాబు సర్కార్ అప్పులు చేసేసిందని విమర్శించాం.. మనం, అంతకన్నా ఎక్కువ అప్పులు చేస్తున్నాం.. ప్రజలకు ఈ విషయమై ఏం సమాధానమివ్వగలం.?’ అంటూ సదరు నేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్దనే తన అభిప్రాయాన్ని కుండబద్దలుగొట్టారట. మొత్తమ్మీద, తొలి బడ్జెట్తో సొంత పార్టీ నేతల్నే మెప్పించలేకపోయారన్నమాట ఆర్థిక మంత్రి బుగ్గన, ముఖ్యమంత్రి జగన్.
999962 978112Magnificent beat ! I would like to apprentice whilst you amend your internet site, how could i subscribe for a weblog web site? The account helped me a appropriate deal. I had been a bit bit acquainted of this your broadcast provided brilliant transparent thought 824318