పొమ్మనలేక పొగ పెట్టడం కాదు.. పార్టీలోంచి బయటకు పంపేస్తూ, ఆ విషయాన్ని స్క్రిప్ట్ రూపంలో తెలియజేసినట్టుంది వ్యవహారం.! ఇదీ వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధక్షురాలు.. అనే పదవికి రాజీనామా చేయడానికి సంబంధించి చోటు చేసుకున్న పరిణామాల తీరు.
కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాక వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ పార్టీకి వైఎస్ జగన్ అధ్యక్షుడు కాగా, వైఎస్ విజయమ్మ గౌరవాధ్యక్షురాలు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు వైఎస్ విజయమ్మ.
పులివెందుల నుంచి గతంలో ఆమె ఎమ్మెల్యేగా పని చేశారు. 2014 ఎన్నికల్లో విశాఖ నుంచి లోక్ సభకు విజయమ్మతో పోటీ చేయించడంతోనే ‘వెన్నుపోటు’ రాజకీయం షురూ అయ్యింది. నిజానికి, ఆ ఎన్నికల్లో గెలిచే నియోజకవర్గం నుంచి తన తల్లిని నిలబెట్టాలన్న కనీస ఇంగితం వైఎస్ జగన్ మర్చిపోయారంటూ అప్పట్లో కొందరు వైసీపీ నేతలే ఆఫ్ ది రికార్డుగా వ్యాఖ్యానించారు.
అది గతం.! ప్రస్తుతానికి వస్తే, గత కొంతకాలంగా విజయమ్మ, వైసీపీ పార్టీ కార్యకలాపాలకు దూరంగా వుంటూ వస్తున్నారు. ఆ మాటకొస్తే, గతంలో వైసీపీకి అన్నీ తానే అయి వ్యవహరించిన వైఎస్ షర్మిల (వైఎస్ జగన్ జైలుకి వెళ్ళిన సమయంలో..) ఆ తర్వాత, అన్న రాజకీయంగా తనను నిర్లక్ష్యం చేయడంతో, తెలంగాణలో వేరు కుంపటి పెట్టారు.. అలా ఆవిర్భవించిందే వైఎస్సార్ తెలంగాణ పార్టీ.
విజయమ్మకి వైఎస్సార్ తెలంగాణ పార్టీ బాధ్యత వచ్చిపడిందిప్పుడు. పాపం విజయమ్మ.. గౌరవాధ్యక్షురాలిగా వైఎస్సార్ తెలంగాణ పార్టీకి వ్యవహరించాల్సి వస్తోంది. రేప్పొద్దున్న వైఎస్సార్టీపీ కూడా అధికారంలోకి వస్తేనో.? అప్పుడూ ఆమె గౌరవాధ్యక్షురాలిగా పనికిరాకపోవచ్చు.
బంధాలు.. అనుబంధాలు.. రాజకీయాల్లో ఇలాగే తగలడతాయ్.! గౌరవ ప్రదంగా వైఎస్ విజయమ్మను రాజ్యసభకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పంపలేకపోయారాయె.! ఇదీ ఇప్పుడు వైసీపీ ప్లీనరీ సందర్భంగా, ఆమె ‘వైసీపీ గౌరవాధ్యక్షురాలు’ పదవికి రాజీనామా చేశాక, వైసీపీ శ్రేణుల్లో జరుగుతున్న చర్చ.
616511 520902The article posted was very informative and valuable. You individuals are performing a great job. Maintain going. 181822
233847 459213hello excellent site i will definaely come back and see once more. 148073