కాదేదీ రాజకీయానికి అనర్హం.! ఔను, రాజకీయాల్లో రాజకీయమే చేస్తారు.! డౌటేముంది.? రాజకీయమంటే సేవ అన్నది ఒకప్పటి మాట. ఇప్పుడు రాజకీయం అంటే రాజకీయం మాత్రమే.! సో, ఇక్కడ విజ్ఞత అనేది వుండదు. కుటుంబ బంధాలు వుండవు. అసలు మానవత్వం అనేదే వుండకూడదేమో.!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద పదే పదే ‘దత్త పుత్రుడు’ అనే కామెంట్స్ని నిస్సిగ్గుగా వేసేస్తుంటారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్. అసలు దత్త పుత్రుడు అంటే ఏంటి.? ఆ మాట అనొచ్చా.? అనకూడదా.? అన్న విజ్ఞత ఏమాత్రం పాటించరు. అదే వైఎస్ జగన్ వ్యవహారశైలి.
ఒక అబద్ధాన్ని పదే పదే చెబుతూ పోతే, అదే నిజమైపోతుందనే గుడ్డి నమ్మకం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిది.! ఇంతకీ, ‘దత్త’ అన్నమాట పవన్ కళ్యాణ్తోనే వైఎస్ జగన్ ఆపేస్తారా.? లేదంటే, తన సోదరి వైఎస్ షర్మిలకీ ఆపాదిస్తారా.?
వైఎస్ షర్మిల, తన పార్టీ వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడామె కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల. రాజకీయం వేరు, కుటుంబ బాంధవ్యాలు వేరన్నట్టు.. చెల్లెల్ని ఇంటికి రప్పించుకున్నారు.. మేనల్లుడి పెళ్ళికి సంబంధించిన ఆహ్వాన పత్రికనీ అందుకున్నారు.
చిరంజీవి – పవన్ కళ్యాణ్ మాత్రం సోదరుల్లా కూడా కలిసి వుండకూడదు. వుంటే, చూసి ఓర్చుకోలేరు వైఎస్ జగన్. తన అను‘కుల’ మీడియా ద్వారా చిరంజీవి, పవన్ కళ్యాణ్ మీద విషం చిమ్ముతారు. పార్టీ ముఖ్య నేతల ద్వారా చిరంజీవిపైనా, పవన్ కళ్యాణ్పైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయిస్తుంటారు.
ఏం, వైఎస్ షర్మిల మీద ‘దత్త పుత్రిక’ అనే విమర్శల్ని వైఎస్ జగన్ తన అను‘కుల’ మీడియా ద్వారాగానీ, తన పార్టీకి చెందిన నేతల ద్వారాగానీ ఎందుకు చేయించడంలేదు.? పార్టీని అమ్మేసుకున్న వైఎస్ షర్మిల.. అనే విమర్శల్ని ఎందుకు తీసుకురావడంలేదు.? ఏమో, ముందు ముందు అవీ చేస్తారేమో.? చేస్తారంటారా.?
వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి అయితే, చంద్రబాబు పంచన షర్మిల చేరారనీ, ఆయన సూచనలతోనే కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిపోయారనీ ఇప్పటికే విమర్శలు చేసేశార్లెండి.! రాజకీయానాం.. న సిగ్గు.. న లజ్జ.. అనాలేమో.!