ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి, తాను ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తోన్న పులివెందుల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ‘పులివెందుల అభివృద్ధికి ఎంత ఖర్చు చేసినా తక్కువే..’ అంటూ వైఎస్ జగన్ మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. మంచిదే.. రాష్ట్రంలో ఏ నియోజకవర్గం అభివృద్ధి చెందినా ఆహ్వానించాల్సిందే. కానీ, రాజధాని అమరావతి మాటేమిటి.?
చంద్రబాబు చెబుతున్నట్లు లక్ష కోట్లతో కాకపోయినా, ఓ ఐదు వేల కోట్లు.. ఓ పది వేల కోట్లు.. ఓ పదిహేను వేల కోట్ల రూపాయలు అయినా, రాజధాని అమరావతికి ఖర్చు చేస్తే బావుంటుంది కదా.! ఎటూ, వైఎస్ జగన్ ప్రభుత్వం చెబుతున్న ‘మూడు రాజధానుల కాన్సెప్ట్’లో అమరావతిని శాసన రాజధానిగా పేర్కొన్నారు. ఆ శాసన రాజధాని.. అనే కోణంలో అయినా, అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకైనా గడచిన ఏడాదిన్నర కాలంలో శ్రీకారం చుట్టి వుండాల్సింది. కానీ, ఇప్పటిదాకా అమరావతి ప్రాంతంలో కొత్తగా జరిగిన అభివృద్ధి ఏమీ లేదు.
పైగా, చంద్రబాబు హయాంలో అధికారిక భవనాల నిర్మాణం ఎక్కడైతే ఆగిపోయిందో.. ఇప్పుడూ అదే పరిస్థితి అక్కడ నెలకొంది. అప్పట్లో అక్కడ కనీసం పనుల సందడి అయినా కన్పించేది.. ఇప్పుడు ఆయా భవనాల నిర్మాణం ఆగిపోయి.. కాస్తో కూస్తో నిర్మాణం జరిగినవి కూడా పాడయిపోతున్నాయి. విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తామంటూ.. అక్కడేవో అధికారిక నిర్మాణాలు చేపట్టేందుకు తెరవెనుక ప్రభుత్వం సన్నాహాలు చేస్తోన్న విషయం విదితమే. మరి, అమరావతి ఏం పాపం చేసుకుంది.?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన, పులివెందుల నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో రాజధాని అమరావతి కోసం ఉద్యమిస్తోన్న రైతులు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ‘అమరావతిలో అభివృద్ధి కొనసాగించడానికి ఇష్టం లేదుగానీ.. పులివెందులకు మాత్రం అగ్రతాంబూలం ఇస్తున్నారా.?’ అన్నది అమరావతి రైతుల ప్రశ్న. మరి, వైఎస్సార్సీపీ ఈ ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతుంది.? అసలంటూ అమరావతి విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఆలోచన ఏంటి.? ఏమో, వేచి చూడాల్సిందే.
118283 923957What might you recommend in regards to your put up that you simply made a few days ago? Any sure? 410201
292564 668821Music began playing any time I opened this site, so frustrating! 679913