అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయి బైడెన్ గెలిచినట్లుగా ఆ దేశ యంత్రాంగం మరియు ప్రపంచ దేశాలు అన్ని గుర్తించినా కూడా ట్రంప్ మాత్రం తాను ఒప్పుకోను అంటూ మొండిగా వ్యవహరిస్తున్నాడు. హుందాతనంతో వ్యవహరించకుండా ఎన్నికల వ్యవస్థను తప్పుబట్టాడు. ఇప్పుడు అదే మాదిరిగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా వ్యవహరిస్తున్నాడు అంటూ తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం సరి కాదన్నాడు. ప్రస్తుత సీఎస్ హయాంలో ఎన్నికలు జరిగితే ఎక్కడ అక్రమాలకు తావు ఉండదో అనే ఉద్దేశ్యంతో ఎన్నికలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. రాష్ట్ర సీఎస్ కు ఎన్నికలను అడ్డుకునే హక్కు ఉండదు. కలెక్టర్లు అన్ని సందర్బాల్లో ఈసీకి సహాయ సహకారాలు అందించాల్సి ఉంటుంది. కాని జగన్ వారిని ఎన్నికలకు వ్యతిరేకంగా వాడుకుంటున్నాడు అంటూ యనమల ఆరోపించాడు.
144293 862121I like this blog its a master peace ! Glad I observed this on google . 355906