దాదాపు ఏడు నెలల తర్వాత థియేటర్లు దేశవ్యాప్తంగా ఓపెన్ కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 15 నుండి థియేటర్లను తీర్చుకోవడానికి అవకాశమిచ్చిన విషయం తెల్సిందే. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తిరిగి ఓపెన్ కానున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించినా కానీ ఎగ్జిబిటర్లు థియేటర్లు తెరిచే విధానంపై ఆచి తూచి వ్యవహరించనున్నారు. కొన్ని చోట్ల అక్టోబర్ 15 నుండి తెరవబోతుంటే, మరికొన్ని చోట్ల దసరా నుండి రీ-ఓపెన్ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో దీపావళి నుండి థియేటర్లు తెరుచుకోనున్నాయి.
థియేటర్లు తెరుచుకున్నాక ఏ సినిమాలు ఆడించాలి అన్న విషయంలో కన్ఫ్యూజన్ ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతానికి ఈ ఏడాది ఇప్పటికే విడుదలైన సినిమాలను తిరిగి విడుదల చేయనున్నారు. దీనికన్నా ఓటిటిలో విడుదలైన సినిమాలను విడుదల చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఓటిటి ప్లాట్ ఫామ్స్ కు అందరికీ యాక్సెస్ లేదు. సో అక్కడ మిస్ అవుతున్న వారు థియేటర్లకు వచ్చే అవకాశముంది.
అయితే ఈ విషయంలో థియేటర్ యాజమాన్యాలు ఇగోలకు వెళ్తున్నట్లు అనిపిస్తోంది. వాళ్ళు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఒకటే ఉంది. పరిస్థితులు నార్మల్ అయ్యాక అందరికీ ప్రధమ ఎంటర్టైన్మెంట్ సోర్స్ ఎప్పుడూ థియేటర్స్ మాత్రమే. సో ఇగోలకు పోకుండా ఓటిటి రిలీజ్ లను థియేటర్లలో విడుదల చేస్తే కొత్త సినిమాలు వచ్చే వరకూ ఫీడింగ్ కు బాగుంటుంది.
33634 598355Plenty of writers recommend just writing and composing no matter how bad and if the story is going to develop, youll suddenly hit the zone and itll develop. 108281
465134 858602An fascinating dialogue is value comment. I feel that its finest to write extra on this matter, it could not be a taboo topic nonetheless generally people are not enough to speak on such topics. To the next. Cheers 623733