ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరత తాత్కాలికమేనట. ఏమో, అది నిజమే కావొచ్చు. కానీ, ఈ కొరతకు కారణమేంటి.? వైఎస్ జగన్ సర్కార్ పంతానికి పోయి, కొత్త ఇసుక విధానం అమల్లోకి తెచ్చే క్రమంలో చేసిన జాప్యమే కదా.! లిక్కర్ విధానమంటూ హడావిడి చేసేంతవరకూ పాత విధానం కొనసాగింది. మరి, లిక్కర్ విషయంలో కొత్త విధానం వచ్చేదాకా పాత విధానంలో లిక్కర్ని విక్రయించడం ఆపేయకపోయారా.? అంటే, మద్యం ద్వారా వచ్చే ఆదాయం ప్రభుత్వానికి అవసరం. ఇసుకతో వచ్చే ఆదాయం కూడా అవసరమే అయినా, నిర్లక్ష్యం. ఐదు నెలలుగా ఆంధ్రప్రదేశ్లో ఇసుక సమస్యతో లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు.
పనుల్లేక అప్పులపాలైపోయి, బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఓ పక్క జనం ప్రాణాలు కోల్పోతోంటే, ‘తాత్కాలిక సమస్య..’ అంటూ వైసీపీ ముఖ్య నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో వెటకారాలు చేస్తున్నారు. ‘ఇసుక కొరత అని ఆందోళనకు దిగుతున్న పచ్చ పార్టీ, బానిస పార్టీలు కోరుకునేదేంటంటే వర్షాలు కురవొద్దు..’ అంటూ ఏదో అడ్డగోలు రాత రాసేశారు ట్విట్టర్లో విజయసాయిరెడ్డి.
వర్షాలకీ, ఇసుకకీ ఏంటి సంబంధం.? గతంలో వరదలు ఉప్పొంగినా ఇసుక సమస్య తలెత్తలేదు.. నిర్మాణాలూ ఆగిపోలేదు. ఇసుక విషయంలో విపక్షాలే కాదు, అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కూడా భవన నిర్మాణ కార్మికులకు అండగా వుంటానంటున్నారు.. ఇసుక పొరుగు రాష్ట్రాలకు అక్రమంగా తరలిపోతోందంటూ ఆరోపిస్తున్నారు. ముందు ఆ తరలిపోయే ఇసుని ఆపి, దాన్ని రాష్ట్రంలో నిర్మాణాలకు వినియోగిస్తే.. ఆత్మహత్యలు ఆగుతాయ్. కానీ, ఇసుక నుంచి తైలం పిండుకోవడం మీద శ్రద్ధపెట్టిన అధికార పార్టీ.. అలాంటి మంచి పనులెందుకు చేస్తుంది.?
41174 174315How considerably of an appealing guide, maintain on producing greater half 350251
232480 304682Excellent publish from specialist also it will probably be a fantastic know how to me and thanks really much for posting this valuable data with us all. 783573