రామ్ గోపాల్ వర్మ అంటే బోల్డ్ నెస్ కు పెట్టింది పేరు. అలాంటిది ఆయన శిష్యులకు కూడా అలాంటి తీరే ఉంటుంది అనుకుంటే ఎలా? అవును, రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అయిన ప్రముఖ నటుడు జెడి చక్రవర్తి బోల్ సీన్స్ విషయంలో స్పష్టమైన అభిప్రాయం ఉంది.
“శృంగారం అనేది పర్సనల్ విషయం. ఇది తెర మీద చూపించాల్సిన అవసరం ఏంటో నాకు అర్ధం కాదు. ఓటిటికు సెన్సార్ కాదు. దర్శకుడి బుర్రకు సెన్సార్ ఉండాలి. ఏది చూపించాలి, ఏది చూపించకూడదు అనేది దర్శకుడికి స్పష్టమైన అవగాహన ఉండాలి. ఈ మధ్య ఒక సిరీస్ చూసాను. అందులో మొదటగా శృంగారపు సన్నివేశం ఉంటుంది. దాని తర్వాత మర్డర్ ఉంటుంది. ఆ తర్వాతే కథలోకి వెళ్తాడు దర్శకుడు. ముందు ఆ సన్నివేశం లేకపోయినా కథలో ఎలాంటి మార్పు ఉండదు. అలాంటప్పుడు అంత బోల్డ్ గా చూపించాల్సిన అవసరం ఏంటి? నా వరకూ నేను అలాంటి సీన్స్ కు పూర్తిగా వ్యతిరేకం,” అని చెప్పుకొచ్చాడు.