రామ్ గోపాల్ వర్మ తన నెక్స్ట్ సినిమాను ప్రకటించి మరో సంచలనం రేపాడు? ఈ సారి అయన రేపే దుమారం రెండు కులాలకు సంబందించింది కావడంతో అందరు షాక్ అవుతున్నారు. తాజాగా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ లో ప్రెస్ మీట్ పెట్టిన వర్మ తన తదుపరి చిత్రాన్ని కమ్మ రాజ్యంలో కడప రౌడీలు అనే టైటిల్ ప్రకటించాడు. ఆ ప్రకటనతో అక్కడ వాతావరణం పూర్తిగా వేడెక్కింది. ఈ వ్యవహారం పెద్దగా అయ్యేలా ఉందని తెలుసుకున్న వర్మ వెంటనే తన మాటలను వెనక్కి తీసుకున్నాడు. అయితే ఈ స్టోరీ ఐడియా విజయవాడ వచ్చాకే వచ్చిందని ..అన్నారు. విజయవాడ రాగానే బోయపాటి సినిమాలోలా సుమోలు తిరుగుతున్నాయని, కడపలో చుసిన రెడ్లంతా ఇక్కడే ఉన్నారంటూ నవ్వులు కురిపించారు. అందుకే తనకు ఓ స్ఫూర్తి కలిగిందని, ఇక కథ రాయడం మొదలు పెడతానని అన్నారు.
మొత్తానికి వర్మ అనుకున్నది సాధించాడు .. ఎక్కడ ఐతే తన ప్రెస్ మీట్ ని తెలుగు దేశం ప్రభుత్వం ఆపేసిందో అక్కడే ప్రెస్ మీటి పెట్టి పలు సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఇక తానూ తెరకెక్కించిన లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమా ఈ నెల 31న విడుదల అవుతుందని అన్నారు. మరి వర్మ మాటలను వెనక్కి తీసుకున్నాడు కానీ అతని మైండ్ లో ఉన్న టైటిల్ పై తప్పకుండా సినిమా ప్రయత్నాలు మొదలు పెడతారంటూ జోరుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. నచ్చిన ఐడియా ను సినిమా తీసి జనాలమీదికి వదలడంతో వర్మ సిద్ద హస్తుడు. అసలే కమ్మ, రెడ్ల కులాలపై వర్మ సినిమా అంటూ వర్మ ఎందుకు సంచలనం రేపాడో అన్నది షాకిచ్చే ప్రశ్న ?
మరి ఈ విషయంలో ముందు ముందు ఏమి జరుగుతుందో అన్నది ఒక్క వర్మకు తప్ప ఇంకెవరికి తెలియదు. ఇక లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమా విషయంలో జనాలు కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు .. ఎందుకంటే ఇక్కడ విడుదలైన ఈ సినిమాను ఇప్పటికే చాలా మంది ప్రేక్షకులు చూసేసారు. పైగా ఇప్పుడు ఎన్నికలు కూడా పూర్తవడంతో ఈ సినిమా గురించి ఇప్పుడు చర్చించడం అనవసరం అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. చూద్దాం ఏమి జరుగుతుందో.
954658 145534Bereken zelf uw hypotheek. Hypotheek berekenen? Maak snel een indicatieve berekening van het maximale leenbedrag van uw hypotheek. 809931
156170 636211Id ought to verify with you here. Which isnt one thing I often do! I get pleasure from reading a put up that will make individuals believe. Moreover, thanks for permitting me to comment! 71659