ఏపీకి ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన వ్యయమంతా కేంద్రమే భరించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో దాదాపు రూ.30వేల కోట్లకుపైగా కోత పెట్టాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినందున దానికయ్యే మొత్తం వ్యయం కేంద్రమే భరించాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు హైకోర్టులో వాదనలు వినిపించారు. పోలవరం ఖర్చంతా కేంద్రమే భరించేలా ఆదేశించాలని కోరుతూ కేవీపీ రామచంద్రరావు దాఖలు చేసిన పిటిషన్ లో ఉండవల్లి ఇంప్లీడ్ అయ్యారు. దీనిపై గురువారం విచారణ జరిగింది.
ఈ సందర్భంగా అరుణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. పోలవరం ప్రాజెక్టు 2013-14 అంచనా ధరల ప్రకారం రాష్ట్రానికి రావాల్సింది రూ.7053 కోట్లు మాత్రమేనని కేంద్ర జల్ శక్తి శాఖ వాదించడం సరికాదన్నారు. ఇలా అనడం ద్వారా దాదాపు రూ.30వేల కోట్లు కోత పెట్టాలని చూస్తోందని ఆరోపించారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన నేపథ్యంలో దానికయ్యే మొత్తం వ్యయాన్ని కేంద్రమే భరించాల్సి ఉంటుందని వాదించారు. అయితే, ఈ వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కేంద్రం దాఖలు చేసిన బదిలీ పిటిషన్ పై నిర్ణయం ఏమిటో తెలియజేయాలని సహాయ సొలిసిటర్ జనరల్ కు స్పష్టంచేస్తూ విచారణను మార్చి 17కి వాయిదా వేసింది.
232779 840111When I initially commented I clicked the “Notify me when new comments are added” checkbox and now each time a comment is added I get three e-mails with the same comment. Is there any way you can remove me from that service? Appreciate it! 697870
160932 185873Id forever want to be update on new posts on this web site , bookmarked ! . 222678