ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే డిస్కషన్. అదేమంటే, మూడు రాజధానుల అంశం. ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తే ఎంతవరకు ఉపయోగం.. ఎంత వరకు అభివృద్ధి సాధిస్తుంది. ప్రభుత్వం చెప్తున్నట్టుగా నిజంగానే మూడు రాజధానులతో లాభం ఉంటుందా లేదా అనే విషయం గురించే చర్చించుకుంటున్నారు. ఐదేళ్ల క్రితం రాష్ట్రం ఏర్పడింది. ఐదేళ్ళలో ఎంత ప్రగతిని సాధించింది అని చూసుకుంటే శూన్యం అని చెప్పాలి.
రాష్ట్రం ప్రగతికి ఆమడ దూరంలో ఉండిపోయింది. బాబు అధికారంలో ఉండగా హైటెక్ పాలన అంటూ సమయాన్ని వృధా చేసుకున్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ప్రజల్లోకి వెళ్ళిన జగన్ మూర్ఖంగా ప్రవర్తిస్తూ… పాలనను పక్కదారి పట్టిస్తున్నారు. రాజుకు తగ్గట్టుగానే మంత్రులు అన్న చందాన, మంత్రులు వాలకం కూడా అలానే ఉన్నది. అసలు విషయం పక్కన పెట్టి జగన్ పేరును తారక మంత్రంలా జపిస్తున్నారు.
కనీసం ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ కాదు అని చెప్పడానికి జంకుతున్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపడానికి సమయం సరిపోతుంది. హైటెక్ పాలన, ప్రపంచంలోనే టాప్ రాజాధానిని ఏర్పాటు చేసుకోవాలి అనే ఆలోచనలతో ఇష్టం వచ్చినట్టుగా అప్పులు చేసింది. అటు కేంద్రం నుంచి వచ్చిన నిధుల విషయంలో కేంద్రంతో పేచీ పెట్టుకుంది. ఇచ్చిన వాటికి లెక్కలు చూపకపోవడంతో నిధులు ఇవ్వడం తగ్గించేసింది.
అప్పుడు ఆ ప్రభుత్వం అప్పులు ఇలా చేసింది, అలా చేసింది అని చెప్తున్నది. ఇన్ని లక్షల కోట్లు రాష్ట్రానికి అప్పులుగా ఉన్నపుడు మూడు రాజధానులు అవసరమా అని ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు. నవరత్నాల పేరుతో ఇచ్చిన హామీలను నెరవేర్చిడానికి తడిసిమోపెడు అవుతుంది. పింఛన్లు, విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇలా ఒక్కటేమిటి ఎన్నింటినో ప్రభుత్వం నెరవేర్చాల్సి ఉన్నది. వీటన్నింటికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో తెలియడంలేదు. ఇప్పుడు మూడు రాజధానులు డబ్బులు ఎలా తీసుకొస్తుందో తెలియదు. రాష్ట్రానికి తగినంత ఆదాయం కూడా లేదు. ఇలా అన్ని హామీలు ఇచ్చుకుంటూ పొతే, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకంటే దారుణంగా ఓటమిపాలవ్వాల్సి వస్తుంది. అది కాస్త గుర్తుపెట్టుకుంటే మంచిది.
229669 222551I like this blog so considerably, saved to bookmarks . 355093
523124 775733Significant other, this superb internet site is fabolous, i merely adore it 8751