“పొరుగింటి పుల్లకూర రుచి”.. ఇది మన తెలుగు సినీ ప్రేక్షకుల్లో కొందరికి ఎప్పుడూ వర్తిస్తుంది. మన దగ్గర టాలెంట్ ఉన్నా పక్క చూపులు చూడటం అలవాటే. లోకల్ టాలెంట్ ని ప్రోత్సహించడం కంటే పక్క కథలు, టెక్నీషియన్లు, దర్శకులంటే రుచి. ఫలితం.. వాళ్ల దగ్గర మనం లోకువ.. వాళ్లూ అంతకంటే చేస్తారు. సినిమా యూనివర్సల్ అయిందని మనం అనుకుంటే కాదు.. అవతలివారూ అనుకోవాలి. కానీ.. అలా జరుగుతుందా..? రీసెంట్ తెలుగు రిలీజ్ ఓ తమిళ సినిమాకు రీమేక్. సినిమా చూసే ప్రేక్షకులు పది మంది అయ్యారు.. విమర్శకులు, యాంటీ ఫ్యాన్స్ తొంభై మంది తయారయ్యారు. అసలు మూవీతో, నటుడితో పోలిక. ‘సింహం వేటకెళ్లేటప్పుడు దారిలో వచ్చే ఊరకుక్కల్ని పట్టించుకోదు’ జై చిరంజీవ లో చిరంజీవి డైలాగ్ వీళ్లకే.
అదే చిరంజీవి చేస్తే..
రీసెంట్ గా రజినీకాంత్ సినిమా రిలీజ్ అయింది. అందులో హిందీ, కన్నడ, మళయాల హీరోలూ నటించారు. తర్వాతి సినిమాలో బాలీవుడ్, టాలీవుడ్ హీరోలతో మల్టీస్టారర్ అని టాక్. దీనికి కొన్ని మన తెలుగు మీడియా సంస్థలే అబ్బో, ఆహా.. అదీ సూపర్ స్టార్ అంట. ఇదే చిరంజీవి చేస్తే.. చిరంజీవి పనైపోయిందా.. పరభాషా స్టార్స్ అందుకేనా..? అంటాయి. చిరంజీవి హీరోయిన్ తో డ్యూయెట్లు, రొమాన్స్ చూసి.. తమిళ హీరోలు ఏజ్ తగ్గ సినిమాలు చేస్తుంటే చిరంజీవి ఇంకా ఏంటిలా..? అంటాయి. చిరంజీవి చేసిన ఆచార్య, గాడ్ ఫాదర్ హీరోయిన్స్, డ్యూయెట్స్ లేవు. వాటిని ఆదరించిన శాతమెంత. వాటిని ప్రస్తావించే వారు లేరు. చిరంజీవికి సలహాలిచ్చేస్తారు.. క్యూ కట్టేస్తారు. వాళ్లకే అన్నీ తెలుసు కదా మరీ..!
జస్ట్ టైమ్ గ్యాప్ అంతే..
చిరంజీవిని పక్క రాష్ట్ర హీరోతో పోలిక పెట్టే కొన్ని మీడియా సంస్థలు యూఎస్ లో చిరంజీవి రేంజ్.. అని రజినీ సినిమా కలెక్షన్లతో పోల్చి బురదలో డ్యాన్స్ ఆడుతున్నాయి. అదే చిరంజీవి 9ఏళ్ల గ్యాప్ తర్వాత చేసిన ఆరింటిలో 3 సినిమాలు 100కోట్ల షేర్ సాధించడం అవి తట్టుకోలేవు. ఆ తమిళ హీరోలకు ఒక్క బ్లాక్ బస్టర్ పడి పుష్కర కాలం దాటిందీ కనిపించదు. పైగా వారికి చిరంజీవిలా గ్యాప్ లేదు. రజినీ పెటా చిరంజీవి సైరా 100కోట్ల షేర్ కలెక్షన్లకు చాలా దూరం. అన్నాతే చూసినోళ్లు లేరు. దర్బార్ వచ్చింది వెళ్లింది. ఇప్పుడు మనకి పడనోడి సినిమాతో రజినీ సినిమా వస్తోంది.. డ్యూటీ చేసేయాలి. ఆచార్య నుంచి వాల్తేరు వీరయ్యకు గ్యాప్ 8నెలలే. భోళా శంకర్ నుంచి గ్యాప్.. మరో 8నెలలే..! అక్కడున్నది.. ‘చిరంజీవి’.