ఎన్ని ప్లాపులు ఇచ్చినా తేజ అంటే ఉండే బజ్ వేరు. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తేజ మళ్ళీ సీత చిత్రంతో కిందపడ్డాడు. అయితే కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు వరసగా రెండు సినిమాలను ప్రకటించాడు. ముందుగా గోపీచంద్ హీరోగా అలివేలు వెంకటరమణ అనే చిత్రం చేస్తాడు. అది పూర్తయ్యాక రాక్షసరాజు రావణాసురుడు అనే చిత్రాన్ని రానా హీరోగా తెరకెక్కిస్తాడు.
ఈ లాక్ డౌన్ సమయంలో తేజ తన దృష్టి అంతా అలివేలు వెంకటరమణ చిత్రంపై పెట్టినట్లు తెలుస్తోంది. వెంకటరమణకు జోడిగా అలివేలుని వెతికే పనిలో ఉన్నాడు తేజ. ముందుగా కాజల్ ను అనుకున్నా రీసెంట్ గానే తనతో వర్క్ చేయడంతో వద్దనుకున్నాడని తెలుస్తోంది. ఇక అనుష్క గోపీచంద్ తో ఈ సినిమా కోసం వర్క్ చేయనుందని ప్రచారం జరిగింది కానీ తేజ అసలు ఆమెను అప్రోచ్ అవ్వలేదని సమాచారం.
రకుల్ ప్రీత్ లేదా సాయి పల్లవిలలో ఒకరిని ఈ సినిమా కోసం ఎంపిక చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రకుల్ కెరీర్ టాలీవుడ్ లో అంత ఆశాజనకంగా లేదు. తనను అప్రోచ్ అయితే కాదనే అవకాశాలు తక్కువే. ఇక సాయి పల్లవి కూడా వరస ఫెయిల్యూర్స్ తో వెనుకబడినా ఆమె చేతిలో విరాటపర్వం, లవ్ స్టోరీ చిత్రాలు ఉన్నాయి. ఈ సినిమాలు కనుక హిట్ అయితే మళ్ళీ ఆమెకు డిమాండ్ పెరగడం ఖాయం. మరి ఈ ఇద్దరిలో ఎవరు అలివేలు అవుతారో చూడాలి.
481976 168978I will proper away grasp your rss as I can not in finding your e-mail subscription hyperlink or e-newsletter service. Do youve any? Kindly permit me realize so that I could subscribe. Thanks. 287818
263466 108348if this post was likened to a flavor of yogurt, what flavor would it be? Banana, I believe. 653196
781647 725067so facebook recommended me the pages food and eating ,,, yeah Im obese|HasmAttack| 300612