నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ‘పర్యావరణ అనుమతుల్లో అతిక్రమణలు’ జరిగాయంటూ సంచల వ్యాఖ్యలు చేసింది. ప్రాజెక్టు పూర్తయిన దరిమిలా, ఉపశమన చర్యలు తీసుకోవాల్సిందేనని ఎన్జీటీ తేల్చి చెప్పింది.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా, రికార్డు సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుని దాదాపుగా పూర్తి చేసిన విషయం విదితమే. ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో వివిధ రాజకీయ పార్టీలు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేపట్టాయి. రైతులు సైతం రోడ్డెక్కి ఆందోళనలకు దిగారు. లాఠీలు విరిగాయి, కొందరు రైతులు బలవన్మరణాలకూ పాల్పడ్డారంటూ అప్పట్లో పెద్దయెత్తున దుమారం రేగింది.
ఎలాగైతేనేం, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యింది.. ఆ ఫలాలు రైతులకు అందుతున్నాయి కూడా. ఓ పక్క సాగునీరు, ఇంకోపక్క పర్యాటకం పరంగా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఆయా బ్యారేజీలు తెలంగాణ ఇమేజ్ని పెంచాయన్నది నిర్వివాదాంశం.
అయితే, పర్యావరణ అనుమతుల విషయంలో కేసీఆర్ సర్కార్కి షాకుల మీద షాకులు ఇప్పటికీ తగులుతున్నాయి. ప్రాజెక్టు పూర్తయిన దరిమిలా, ఉపశమన చర్యలు తీసుకోవాలని ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాల్ని కేసీఆర్ ప్రభుత్వం ఎలా పరిగణనలోకి తీసుకుంటుందన్నది వేచి చూడాల్సిందే.
563895 583531Magnificent beat ! I would like to apprentice whilst you amend your internet site, how could i subscribe for a weblog web site? The account helped me a appropriate deal. I had been slightly bit acquainted of this your broadcast provided brilliant transparent concept 83221
64364 368928Id forever want to be update on new posts on this website , bookmarked ! . 158496