విన్నారా ఈ వింత.? అప్పుడు వంద కోట్లు సమర్పించుకుని చంద్రబాబు హయాంలో టీటీడీ బోర్డ్ సభ్యుడిగా అవకాశం దక్కించుకున్న శేఖర్ రెడ్డి ఇప్పుడు వైఎస్ జగన్ పాలనలో ‘దేవుడు’కి ఎంత సమర్పించుకున్నాడో కానీ, మళ్లీ టీటీడీ బోర్డ్ సభ్యుడిగా ఛాన్స్ కొట్టేశాడు. ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ప్రభుత్వం తాను చేసిన పనిని సమర్ధించుకోలేక శేఖర్ రెడ్డిని కాస్తా, శేఖర్గా మార్చేసింది. ఆ శేఖర్ ఎవరన్న దానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు వైసీపీ నేతలు. ‘తప్పేముంది.? ఆయన మీద కేసులు నిరూపించబడలేదు కదా..’ అని వైసీపీ నేతలు సావు కబురు సల్లగా చెబుతున్నారు.
ఒకప్పుడు ఇదే వైసీపీ నేతలు శేఖర్ రెడ్డిని దొంగగా అభివర్ణించారు. దానికి సంబంధించిన వీడియోలు అలాగే ఉన్నాయి. హిందూ ధర్మాన్ని చంద్రబాబు సర్వనాశనం చేస్తున్నారనడానికి శేఖర్ రెడ్డి ఉదంతమే నిదర్శనమని అప్పట్లో ఆరోపించిన వైసీపీ నేతలు ఇప్పుడు ఏ ధర్మాన్ని తుంగలో తొక్కడానికి శేఖర్ రెడ్డిని మళ్లీ టీటీడీలోకి తీసుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ‘ఆయన భక్తుడు.. శ్రీవారికి చాలా సేవ చేశాడు. అలాంటి వ్యక్తిని తీసుకుంటే తప్పేంటీ..?’ అని శేఖర్ రెడ్డి విషయంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వయంగా వెనకేసుకు రావడం గమనార్హం.
వెంకటేశ్వర స్వామి మీద శేఖర్ రెడ్డికి భక్తి ఎంతుందో కానీ, అధికారంలో ఎవరుంటే వాళ్ల మీద భక్తి మాత్రం శేఖర్ రెడ్డికి చాలా ఎక్కువ. దురదృష్టమేంటంటే, శేఖర్ రెడ్డిలాంటి భక్తులకి ప్రభుత్వాలు అత్యుత్సాహంతో అన్నీ సమర్పించేసుకుంటుంటాయ్. ఇందుకే కదా, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమల కొండ ఎప్పటికప్పుడు వివాదాలకెక్కుతున్నది. స్వామివారి నగలు మాయవుతున్నాయంటే ఊరికినే కాదండోయ్.. అన్నది సాధారణ ప్రజానీకం ఆవేదన.
824537 639452I discovered your weblog internet web site on bing and appearance several of your early posts. Preserve up the extremely great operate. I just now additional the RSS feed to my MSN News Reader. Seeking toward reading far a lot more on your part down the road! 192167
554974 784384This internet internet site is my aspiration, very excellent style and Perfect articles. 285739