పొరుగు రాష్ట్రాలతో సన్నిహితంగా వుండడం తప్పేమీ కాదుగానీ, పనిగట్టుకుని పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రిని పదే పదే ప్రశంసించడమంటే కాస్త అనుమానించాల్సిన విషయమే. గతంలో చంద్రబాబు, కేసీఆర్ విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తే, దాన్ని తీవ్రంగా తప్పు పట్టిన వైఎస్ జగన్, ఇప్పుడు తాను మాత్రం ఏకంగా కేసీఆర్ భజనలో మునిగి తేలుతున్నారు.
నిజానికి, ఎన్నికలకు ముందే కేసీఆర్ – జగన్ మధ్య దోస్తీ కుదిరింది. ఆ మాటకొస్తే, 2019 ఎన్నికల్లోనే కాదు.. 2014 ఎన్నికల్లో కూడా కేసీఆర్ – జగన్ మధ్య దోస్తీ నడిచింది. ఇంకాస్త ఎక్కువగా, 2019 ఎన్నికల్లో కేసీఆర్కి జగన్ సహకరించారు. ఈ దోస్తీ ఎంత ప్రత్యేకమైనదంటే, వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీని 2014 ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అప్పగించేంతటి ప్రత్యేకమైనది.
గతం గతః ప్రస్తుతానికి వస్తే.. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో నీటి గొడవ రాయలసీమ – తెలంగాణ ప్రాంతాల మధ్య వుండేది. అదీ వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో. దొంగతనంగా, దుర్మార్గంగా తెలంగాణ నీటిని, రాయలసీమకు తరలిస్తున్నారంటూ అప్పట్లో కేసీఆర్ సహా తెలంగాణ నేతలు నానా యాగీ చేశారు. ఓ దశలో వైఎస్సార్ని తెలంగాణ ద్రోహిగా కేసీఆర్ చిత్రీకరించారు. ఆ ‘తెలంగాణ ద్రోహి’ అవార్డుని వైఎస్ జగన్ కూడా కేసీఆర్ చేతుల మీదుగా అందుకున్నారనుకోండి.. అది వేరే విషయం.
కానీ, జగన్ – కేసీఆర్ మధ్య దోస్తీ ఎలా నడుస్తోంది.? ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్న. వైఎస్ జగన్ ‘వీక్ పాయింట్’ కేసీఆర్ దగ్గర వుందనీ, అక్కడే వైఎస్ జగన్, కేసీఆర్కి సరెండర్ అయిపోయారనీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ ‘వీక్ పాయింట్’ పట్టుకుని, కేసీఆర్ తాను చెప్పినట్టల్లా జగన్ ‘ఆడేలా’ చేస్తున్నారంటూ ప్రత్యర్థులు చేస్తున్న విమర్శల్ని తిప్పికొట్టే క్రమంలో వైసీపీ శ్రేణులు అలసత్వం ప్రదర్శిస్తుండడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. అక్రమాస్తుల కేసు ఒక్కటే కాదు, ఇంకా చాలా విషయాలున్నాయనీ, వాటి కారణంగానే జగన్, కేసీఆర్ భజన చేస్తున్నారనీ జరుగుతున్న ప్రచారంపై వైసీపీ శ్రేణులు ఘాటుగా స్పందించకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.?
363985 89391Some actually wondrous work on behalf with the owner of this internet site, perfectly fantastic subject material . 831793