రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు క్షణం కూడా ఆ పదవిలో ఉండే అర్హత లేదని ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. గవర్నర్ ఆయన్ను ఆ పదవి నుంచి భర్తరఫ్ చేయాలని కూడా డిమాండ్ చేశారు. నెల్లూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి పెద్దిరెడ్డిని గృహ నిర్భంధం చేయాలని ఆయన ఇచ్చిన ఆదేశాలను కోర్టు కోట్టేసిన విషయాన్ని కాకాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. నిమ్మగడ్డ భారీ మూల్యం చెల్లించుకోవడం ఖాయమని అన్నారు.
తన పరిధి దాటి వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ భారీ మూల్యం చెల్లించుకునేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. అసెంబ్లీ, ప్రివిలేజ్ కమిటీ నిర్ణయాలను ఆయన కోర్టులో కూడా సవాల్ చేయలేరని ఈ సందర్భంగా అన్నారు. రాజ్యాంగం ప్రకారం కాకుండా టీడీపీకి అనుకూలంగా పని చేస్తున్న నిమ్మగడ్డ తగిన మూల్యం చెల్లించుకునే సమయం దగ్గరలోనే ఉందన్నారు. మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి ఎస్ఈసీపై ఫిర్యాదు ఇచ్చిన విషయాన్ని మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
343280 569891This article contains great original thinking. The informational content here proves that points arent so black and white. I feel smarter from just reading this. 720511
818796 659633You should join in a tournament first with the greatest blogs on the internet. I will recommend this internet web site! 775297
641293 917193You seem to be very skilled within the way you write.::~ 489406