కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో ఈ ఏడాది విద్యా సంవత్సరంపై క్లారిటీ రావడం లేదు. కరోనా వైరస్ ఇంకా తన ప్రతాపం చూపిస్తూనే ఉంది. దేశంలోని అనేక వ్యవస్థలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం స్కూల్స్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కరోనా పరిస్థితులు, స్కూల్స్ తెరిచే విషయంపై చర్చించింది.
స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కూడా తన నిర్ణయాన్ని చెప్పింది. సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు తెరుస్తామని ప్రకటించింది. కరోనా తీవ్రతలో మార్పు లేకపోవడంతో అక్టోబర్ 5న స్కూళ్లు తెరవాలని నిర్ణయించింది.
అయితే.. ఇప్పటికీ పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో మరోసారి తన నిర్ణయాన్ని మార్చుకుంది. అక్టోబర్ 5న స్కూళ్లు తెరవాలని భావించినా.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వాయిదా వేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో స్కూల్స్ తెరవడం సరికాదని భావించాం. నవంబర్ 2న స్కూల్స్ తెరవాలని నిర్ణయించాం. అయితే.. ముందుగా నిర్ణయించిన ప్రకారం అక్టోబర్ 5నే పిల్లలకు ‘జగనన్న విద్యా కానుక’ కిట్లను ప్రభుత్వం అందజేస్తుంది. ఆరోజే ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. పరిస్థితులను బట్టి సీఎం వైఎస్ జగన్ ఆరోజు ఏదైనా స్కూల్కు వెళ్లే అవకాశం ఉంది’ అని మంత్రి సురేశ్ తెలిపారు.
829259 273704Thanks for helping out, superb details. 411674
413136 972328Can you give me some suggestions for piece of software writing? 949883
161141 565872Hello to all I cannot realize the strategy to add your site in my rss reader. Assist me, please 85861
40177 966099This was an incredible post. Actually loved studying your website post. Your data was very informative and useful. I believe youll proceed posting and updating frequently. Searching forward to your subsequent one. 693738