Switch to English

పోలవరం వ్యధ: రివర్స్‌ ఇంజనీరింగ్‌ బాధ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

రివర్స్‌ టెండరింగ్‌.. అనే మాట వైఎస్‌ జగన్‌ హయాంలో ప్రముఖంగా తెరపైకొచ్చింది. ఇదెక్కడి చోద్యం.? అని అంతా ముక్కున వేలేసుకుంటున్నాసరే, ‘మేం ఈ విధానం ద్వారా పెద్దయెత్తున ఖర్చు తగ్గించగలుగుతున్నాం..’ అంటూ ఆయా ప్రాజెక్టుల విషయమై వైఎస్‌ జగన్‌ సర్కారు బహు గొప్పగా చెప్పేసుకుంటోంది. పోలవరం ప్రాజెక్టులో భలేగా మిగిల్చేశారే.. మేం కూడా మిగిల్చేద్దామనుకుంటున్నాం.. అంటూ కేంద్రం, సుమారు 25 వేల కోట్ల రూపాయల నిధులకు ‘రివర్స్‌ టెండరింగ్‌’ లాంటిదే చేసింది. దాంతో, పోలవరం ప్రాజెక్టు ఎత్తు కాస్తా 45.7 మీటర్ల నుంచి 41.1 మీటర్లకు తగ్గాల్సి వచ్చింది. ‘శరవేగంగా పోలవరం..’ అంటోంది వైసీపీ ప్రభుత్వం.

ఈ విషయాన్ని వైసీపీ అనుకూల మీడియా ఓ రేంజ్‌లో ప్రచారం చేస్తోంది. సగం ప్రాజెక్టుని శరవేగంగా పూర్తి చేయడమేంటి.? అంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకమే కాదు, ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధం వున్న, ఈ తరహా ప్రాజెక్టుల పట్ల అవగాహన వున్న పొరుగు రాష్ట్రాల్లోని నీటి పారుదల రంగ నిపుణులు, రాజకీయ ప్రముఖులు ఆశ్చర్యపోతున్నారు. ఆ చివర నుంచి ఈ చివరదాకా.. ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు అన్ని జిల్లాలకూ పోలవరం ప్రాజెక్టుతో ప్రయోజనం వుంటుందట.. అదీ సగం ప్రాజెక్టుతోనేని వైసీపీ ప్రభుత్వం చెబుతోంటే నమ్మేదెలా.? కేంద్రం, నిధులు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి, వున్నంతలో ప్రాజెక్టు పూర్తయిపోయిందనిపించేయడమే.. ఇదీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది. అంతే తప్ప, జాతీయ ప్రాజెక్టు గనుక.. కేంద్రానికే బాధ్యత అప్పగించేయాలనో.. విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టు అంశానికి చట్టబద్ధత వుంది గనుక.. న్యాయస్థానాల్ని ఆశ్రయించి అయినా, పూర్తిస్థాయిలో పోలవరం ప్రాజెక్టుని నిర్మించడమో చేయకుండా.. ఈ సగం ప్రాజెక్టు గోలేంటి.? పోలవరం, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆత్మగౌరవం నినాదంగా మారుతోంది.

దురదృష్టవశాత్తూ ప్రత్యేక హోదా అటకెక్కింది.. రైల్వే జోన్‌ కథ ఏమయ్యిందో ఎవరికీ తెలియదు. రాజధాని గురించి మాట్లాడుకోవడమే దండగ. వెనుకబడిన జిల్లాలకు దక్కాల్సిన ప్యాకేజీ సంగతేంటో తెలియని పరిస్థితి.. ఇప్పుడు పోలవరం కూడా ఇలా అయోమయంలో పడితే.. ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తేంటి.? వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టు, వైఎస్‌ జగన్‌ హయాంలో పూర్తి చేసేశామనిపించుకోవడానికి జరుగుతున్న ప్రయత్నం తప్ప, ప్రాజెక్టు పట్ల వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధి అస్సలేమాత్రం కనిపించడంలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనతో పోలవరం జాతీయ ప్రాజెక్టు అయ్యింది.. అంటే, రాష్ట్ర విభజనకు నష్ట పరిహారమన్నమాట. ఇదొక్కటి చాలు, ప్రాజెక్టు ప్రాధాన్యత ఏంటన్నది చెప్పడానికి. దురదృష్టవశాత్తూ పాలకులకు (చంద్రబాబు అయినా, వైఎస్‌ జగన్‌ అయినా) ఆ సోయ లేకుండా పోతోంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...