ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజధాని విషయం రచ్చ జరుగుతున్న విషయం తెల్సిందే. ప్రభుత్వం వికేంద్రీకరణ బిల్లు తీసుకు వచ్చి రాష్ట్రానికి మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని భావిస్తుంది. మరో వైపు అమరావతి ప్రాంత రైతులు మరియు తెలుగు దేశం పార్టీ నాయకులు ఇంకా పలు ప్రజా సంఘాలు పార్టీలు కూడా అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ సమయంలో ఎక్కువ శాతం టాలీవుడ్ సినీ ప్రముఖులు వైజాగ్ ను రాజధానిగా మార్చాలంటూ కోరుకుంటున్నారు.
తాజాగా జబర్దస్త్ యాంకర్ రష్మి కూడా రాజధాని వైజాగ్ అయితే బాగుంటుందనే అభిప్రాయంను వ్యక్తం చేస్తుంది. వైజాగ్ కు చెందిన అమ్మాయి అవ్వడం వల్ల రష్మికి వైజాగ్ రాజధాని కావాలని కోరిక ఉంటుంది. కాని ఆమె సెలబ్రెటీ.. పబ్లిక్ ఫిగర్ కనుక వైజాగ్ ను రాజధాని చేయాలంటూ ఆమె డైరెక్ట్ గా డిమాండ్ చేయలేదు. సన్నిహితుల వద్ద వైజాగ్ రాజధాని అయితే బాగుండు అంటూ చెప్పుకొస్తుందట. ఇక కేంద్ర ప్రభుత్వం నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ 2020 సర్వేలో విశాఖ నగరం కూడా నిలిచింది. 4370 నగరాల్లో విశాఖ కూడా నిలవడం జరిగింది.
తెలుగు ప్రజలు అంతా కూడా వైజాగ్ కు స్వచ్చ సర్వేక్షన్ సర్వేలో ఓటు వేయాల్సిందిగా రష్మి కోరింది. మన విశాఖ నగరం స్వచ్చ సిటీగా నెం.1 స్థానంను దక్కించుకునేలా ప్రతి ఒక్కరు ఓటును వేయాలంటూ ఆమె ప్రచారం చేస్తుంది. వైజాగ్ పై ఆమెకున్న ప్రేమ ఓట్లు అడగడంలోనే తెలుస్తుంది. రాజధాని విషయంలో కూడా రష్మి ఇలా ప్రచారం చేస్తే బాగుంటుంది కదా అంటూ వైజాగ్ వాసులు కోరుకుంటున్నారు.
290821 224856Take a peek at the following suggestions what follows discover perfect method to follow such a mainly because you structure your small business this afternoon. earn money 56855
835075 309100This site is my aspiration , really wonderful pattern and perfect articles . 633713