Rajamouli: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) తో రాజమౌళి (Rajamouli) తెరకెక్కించే సినిమా SSMB29పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. షూటింగ్ ప్రారంభం కోసం మహేశ్ అభిమానులు ఇప్పటికే ఎదరు చూస్తున్నారు. సినిమాపై వస్తున్న వార్తలు వారికి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాజమౌళి ఇప్పుడు ఇంటర్నేషనల్ రికగ్నిషన్ తెచ్చుకోవడమూ ఇందుకు కారణమని చెప్పాలి. ఈ నేపథ్యంలో సినిమాపై రాజమౌళి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
‘మహేశ్ తో సినిమా తెరకెక్కిస్తున్నా. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తా. సినిమాకు టైటిల్ ఇంకా నిర్ణయించలేదు. త్వరలోనే వివరాలు తెలియజేస్తా’నని చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కర్ణాటక రాష్ట్రం బళ్లారిలోని అమృతేశ్వర ఆలయ ప్రారంభోత్సవానికి కుటుంబసభ్యులతో కలిసి హాజరైన రాజమౌళి స్థానిక ప్రముఖులతో మాట్లాడారు.
‘సినిమా కథ అడ్వంచరస్ తో కూడినది. మహేశ్ కి సరిపోయే కథ’ని ఇటివల విజయేంద్ర ప్రసాద్ చెప్పడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరోవైపు సినిమాలో హీరోయిన్ ఇండోనేషియా నటి ఎలిజబెత్ ఇస్లాన్ మరికొందరు హాలీవుడ్ ప్రముఖులు నటించనున్నారనే వార్తలతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.