పోలవరం ప్రాజెక్టు విషయంలో మళ్ళీ అదే లొల్లి. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి రాజ్యసభలో ప్రస్తావన వచ్చినప్పుడు కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టుకి నిధుల సమస్య లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు త్వరితగతిన జరగాల్సిన అవసరం వుందన్నారు. అయితే, పోలవరం ప్రాజెక్టు వ్యయానికి సంబంధించి ఇంకా గందరగోళం కొనసాగుతూనే వుంది.
ఏ ప్రాతిపదికన ప్రాజెక్టు వ్యయాన్ని ఖరారు చేయాలన్న విషయమై అటు కేంద్రం, ఇటు రాష్ట్రం మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ కనిపిస్తోంది. సుమారు 55 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయం.. చంద్రబాబు హయాంలోనే తెరపైకొచ్చింది.. అప్పట్లో కేంద్రం కూడా ఇందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఏమయ్యిందో.. కొద్ది నెలల క్రితం కేంద్రం పోలవరం నిధులపై స్పష్టతనిస్తూ, 25 వేల కోట్ల రూపాయల మేర కొర్రీ పెడుతున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంతో పలుమార్లు సంప్రదింపులు జరిగాక అది కాస్తా, 47 వేల కోట్లకు అటూ ఇటూగా మేటర్ సెటిలయ్యినట్లు కనిపిస్తోంది.
అయితే, కేంద్రం ఇవ్వాల్సిన వేగంతో నిధుల్ని పోలవరం ప్రాజెక్టుకి ఇవ్వడంలేదు. అలా ఇవ్వకపోవడానికి కారణం ప్రాజెక్టు పనులు తగిన వేగంతో జరగకపోవడమేనన్నది కేంద్రం వాదన. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అత్యంత కీలకం. అయితే, ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అయోమయంలో వున్నట్లే కనిపిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నప్పటికీ, ముంపు – పునరావాసం విషయంలో అటు చంద్రబాబు సర్కార్, ఇటు జగన్ సర్కార్ ఒకే తీరులో నడుస్తున్నట్లు కనిపిస్తోంది.
చంద్రబాబు మీద జగన్, జగన్ మీద చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్టు పేరుతో విమర్శలు చేసుకోవడం, కేంద్రానికి బాగా కలిసొస్తోంది. అసలు పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినప్పుడు, పనులు ఆలస్యమైతే, ఆ బాధ్యత కేంద్రానిది కాకుండా ఎలా వుంటుంది.? తన బాధ్యతలనుంచి కేంద్రం తప్పించుకు తిరుగుతోందంటే, దానికి గత చంద్రబాబు సర్కారు, ప్రస్తుత జగన్ సర్కారూ నైతిక బాధ్యత వహించాల్సిందే.
776978 348722Excellent day! This post could not be written any better! Reading this post reminds me of my previous room mate! He always kept chatting about this. I will forward this write-up to him. Fairly certain he will have a excellent read. Thanks for sharing! 937360