వైఎస్సార్సాపీలో నెంబర్ టూ ఎవరు.? అంటే, ఠక్కున విజయసాయిరెడ్డి పేరే చెబుతారు ఎవరైనా. అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ ఏ1 నిందితుడైతే, విజయసాయిరెడ్డి ఏ2 నిందితుడు కాబట్టి.. అని కాదిక్కడ.! పార్టీకి సంబంధించి విజయసాయిరెడ్డిని తన తర్వాతి స్థానంలో వైఎస్ జగన్ కూర్చోబెట్టారన్నది నిర్వివాదాంశం. మరోపక్క, ప్రభుత్వ నిర్ణయాలపైనా విజయసాయిరెడ్డి ముందస్తుగానే సంచలన వ్యాఖ్యలు చేయడం, వాటికి తగ్గట్టుగా ప్రభుత్వ నిర్ణయాలు వుంటుండడం జరుగుతూ వచ్చింది.
అయితే, నిన్నటిదాకా ఒక లెక్క.. ఇకపై ఇంకో లెక్క.. అన్నట్టు మారిపోయింది పరిస్థితి. విశాఖపట్నం శివార్లలోని భీమిలి ప్రాంతమే రాజధాని.. అంటూ ఇటీవల విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయిపోయిందని కూడా నిన్ననే విజయసాయిరెడ్డి ప్రకటించేశారు. కానీ, ఈ రోజు జరిగిన క్యాబినెట్ భేటీ అనంతరం, మంత్రి వర్గ నిర్ణయాల్ని మీడియాకి వెల్లడించిన మంత్రి పేర్ని నాని, విజయసాయిరెడ్డిని కేవలం వైసీపీ నేతగానే అభివర్ణించారు.
‘విశాఖ జిల్లాకి చెందిన వైసీపీ ముఖ్య నేత ఆయన. తన ప్రాంత ప్రజల ఆకాంక్షని ఆయన వెలిబుచ్చారు తప్ప. ఆయన చెప్పినట్లు ప్రభుత్వం నడుచుకోదు..’ అని తేల్చి చెప్పారు పేర్ని నాని. దాంతో, ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు షాక్కి గురయ్యాయి. 3 రాజధానుల వ్యవహారంపై వైఎస్ జగన్ మోహన్రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేయలేదనీ, జీఎన్ రావు కమిటీ గురించి చెబుతూ ‘3 రాజధానులు వుండొచ్చు..’ అని మాత్రమే చెప్పారని మంత్రి పేర్ని నాని చెప్పుకొచ్చారు.
మొత్తమ్మీద, మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు.. వైసీపీలో తీవ్ర ప్రకంపనలు సృష్టించబోతున్నాయన్నమాట. విజయసాయిరెడ్డిని పేర్ని నాని ఇంత లైట్ తీసుకున్నారంటే, విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విషయంలో విజయసాయిరెడ్డి అత్యుత్సాహాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రంగా తప్పుపడుతున్నట్లేనని అనుకోవాలేమో.
74176 428934This is often a fantastic blog, could you be interested in working on an interview about just how you developed it? If so e-mail myself! 859698
751571 469832I got what you mean , saved to my bookmarks , extremely good web site . 323569