పవన్ కళ్యాణ్ తన రాజకీయ ఆలోచనలకు పదునుపెడుతున్నారు. జగన్ అరాచక పాలనకు చెక్ పెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. నెల రోజుల క్రితం వరకు జగన్ కు రాష్ట్రంలో వ్యతిరేకత లేదు. రాజకీయాల్లో మంచి చేస్తే ప్రజలు తప్పకుండా స్వాగతిస్తారు. అందులో సందేహం అవసరం లేదు. అలా మంచి చేస్తూనే… వాళ్లకు వెనకనుంచి చెడు చేయాలని చూస్తే మాత్రం ప్రజలు కోపంతో రగిలిపోతారు. ప్రజల ధర్నా కొద్దిరోజులు ఉంటుందని, త్వరలోనే ప్రజలు ధర్నాలు చేయడం విరమిస్తారని కెసిఆర్ చెప్పడం హాస్యాస్పదంగా మారింది.
ఎందుకంటే, తెలంగాణ ఉద్యమాన్ని కూడా ప్రజలు అలానే తీసుకుంటే ఈరోజు తెలంగాణ వచ్చేది కాదు. కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యేవారు కాదు. నాయకుడుగా ఉన్నప్పుడు ఒకలా, తరువాత మరొకలా ఎందుకో ఇలా అర్ధం కావడం లేదు. జగన్ కు ఉదాహరణగా ఆర్టీసీ ఉద్యోగుల ధర్నాలు చూపించారు. ఉద్యోగుల సమస్య కాబట్టి పెద్దగా పట్టించుకోరు. కానీ, ఇది రాజధాని సమస్య.. రైతుల సమస్య. ప్రజలు అంత తేలిగ్గా తీసుకుంటారు అనుకోవడం పొరపాటే అవుతుంది.
రోజు రోజుకు ఉద్యమం పెరిగిపోతూనే ఉన్నది కాబట్టి జగన్ ఈ సమయంలో అలోచించి నిర్ణయం తీసుకోవాలి. జగన్ దూకుడును ప్రదర్శించి ప్రజలకు ఇబ్బందులు కలగజేయాలని చూస్తే మాత్రం పవన్ ఖచ్చితంగా అడ్డుకట్ట వేస్తారు. అందులో సందేహం అవసరం లేదు. చంద్రబాబు అవుట్ డేటెడ్ నాయకుడు కావడంతో ఆ పార్టీ ఏం చేయలేకపోతున్నది. కానీ, పవన్ అలా కాదు. ప్రజా నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
పైగా ఈ విషయంలో కేంద్రం సహకారం అవసరం ఉన్నది. అన్ని పార్టీలతో ఉన్న విభేదాలు పక్కన పెట్టి అందరిని కలుపుకొని ముందుకు పోవడం ఉత్తమం. ఈ ఆలోచనతో పవన్ కళ్యాణ్ కేంద్రంతో సఖ్యతను పెంచుకుంటున్నారు. పైగా ఇప్పుడు జగన్ ను సిబిఐ ప్రతి శుక్రవారం రోజున కోర్టుకు హాజరు అవుతుండటంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి, దీనిని పవన్ దీనిని వదులుకోకూడదని అనుకుంటున్నారు. జగన్ ను పక్కా వ్యూహంతో దెబ్బకొట్టాలని చూస్తున్నారు. పవన్ ప్లాన్ వర్కౌటైతే జగన్ ఖేల్ ఖతం అయినట్టే.
108962 44655Your talent is really appreciated!! Thank you. You saved me a great deal of frustration. I switched from Joomla to Drupal towards the WordPress platform and Ive fully embraced WordPress. Its so significantly easier and easier to tweak. Anyway, thanks once again. Awesome domain! 745313
405334 33449We will have a hyperlink change agreement between us! 76800