ప్రస్తుతం ఆంధ్రాలో వేడెక్కిన రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ మరో వైపు బాలీవుడ్ పింక్ రీమేక్ లో నటిస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ మొదలైన ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తరువాత అయన క్రిష్ దర్శకత్వంలో మరో సినిమాకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం నిర్మించే ఆ సినిమా విషయంలో పవన్ ఓ కొత్త నిర్ణయం తీసుకున్నాడట.
అదేమిటంటే .. ఈ మధ్య హీరోలు తాము నటించే సినిమాల విషయంలో రెమ్యూనరేషన్ కాకుండా .. నిర్మాణంలో భాగం అయ్యేలా డీల్ కుదుర్చుకుంటున్నారు. సినిమా రిలీజ్ సమయంలో ఓ ఏరియా థియేట్రికల్ హక్కుల రూపంలో, లేదా డిజిటల్, సాటిలైట్ హక్కులను తీసుకుంటూ భారీగా వసూలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంలో సూపర్ స్టార్ మహేష్ అందరికంటే ముందున్నాడు.
అయన నటిస్తున్న ప్రతి సినిమాకు నిర్మాణంలో భాగస్వామ్యం తీసుకుంటున్నాడు. జి ఎం బి బ్యానర్ ని స్థాపించి సినిమాల నిర్మాణంలో భాగం అయినట్టే .. ఇకపై పవన్ కళ్యాణ్ కూడా తాను నటించే సినిమాలకు రెమ్యూనరేషన్ కాకుండా నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని నిర్ణయం తీసుకున్నాడట. క్రిష్ సినిమా విషయంలో కూడా పవన్ తన నిర్ణయాన్ని తెలిపాడని టాక్.
పవన్ కళ్యాణ్ ఇప్పటికే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పేరుతొ ఓ బ్యానర్ ని మొదలెట్టిన విషయం తెలిసిందే. ఇకపై అయన నటించే ప్రతి సినిమాకు పీకే బ్యానర్ కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తుందన్నమాట.
965538 194943Hey there. I want to to ask slightly somethingis this a wordpress web log as we are planning to be transferring over to WP. Additionally did you make this template all by yourself? Numerous thanks. 36054