జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1న జరుగనున్న హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించారు. మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం అయిన ఆయన ఈ వివరాలు వెల్లడించారు. తెలంగాణ, హైదరాబాద్ లో యాక్టివ్ గా ఉంటున్న జనసేన కార్యకర్తల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు కార్యాచరణ కూడా రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఈమేరకు పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.
ఈ విషయమై స్థానిక నాయకులు, కార్యకర్తలతో పలు దఫాలు సమావేశమైనట్టు కూడా జనసేనాని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని పలు డివిజన్లలో జనసేన కమిటీలు క్షేత్రస్థాయిలో పని చేస్తూ ప్రజల పక్షాన నిలబడ్డారని పవన్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని క్షేత్రస్థాయిలోని కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నందున వారి అభీష్టం మేరకు ఎన్నికల్లో జనసేన అభ్యర్థులను నిలుపుతుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
అయితే.. జీహెచ్ఎంసీలో పోటీ విషయమై క్లారిటీ ఇచ్చిన పవన్.. సొంతంగా పోటీ చేస్తున్నారా.. లేక బీజేపీతో పొత్తుతో ముందుకెళ్తారా.. అనేది స్పష్టం చేయలేదు. ఎన్ని డివిజన్లలో పోటీ చేస్తుందనే విషయంపైనా క్లారిటీ ఇవ్వలేదు. పార్టీ అధికారిక ప్రకటనలోనూ స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనతో కలిసే బీజెపీ పోటీ చేస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అంటున్నారు. మరి దీనిపై పవన్ స్పందనేంటో బీజేపీపై ఆయన వైఖరి ఏంటో చూడాలి.
#GHMC ఎన్నికల్లో పోటీకి సిద్ధం – JanaSena Chief Shri @PawanKalyan గారు#JanaSenaForGHMC pic.twitter.com/n33CGX0pwq
— JanaSena Party (@JanaSenaParty) November 17, 2020
845969 690029Spot lets start work on this write-up, I really believe this amazing internet site requirements additional consideration. Ill far more likely be once again you just read additional, thank you that data. 229167
990157 756308my English teacher hate me cause i maintain writing about somebody from The WANTED called Jay, she gives me evils and low 73279
199102 724805Exploring in Yahoo I ultimately stumbled upon this site.Reading this information. 593729