Ippatam: గుంటూరు జిల్లా ఇప్పటంలో(Ippatam) మళ్ళీ కూల్చివేతలు షురూ అయ్యాయి. సాధారణంగా అయితే, ‘జీఐఎస్’ లాంటి ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు, ప్రభుత్వం నుంచి కూల్చివేతల వ్యవహారాలు జరగవు. ఇన్వెస్టర్లు కూల్చివేతలపై అసహనం వ్యక్తం చేసే అవకాశం వుంటుంది గనుక. అది వేరే చర్చ.
‘రెండ్రోజుల పాటు వైసీపీ ప్రభుత్వంపై ఎలాంటి రాజకీయ విమర్శలు చేయబోం..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించిన దరిమిలా, జనసేనను కవ్వించేందుకు ఇప్పటంలో ఇంకోసారి కూల్చివేతలకు వైసీపీ సర్కారు తెరలేపింది. గతంలో జనసేన ఆవిర్భావ దినోత్సవానికి తమ భూముల్ని ఇచ్చినందున ఇప్పటం జనాన్ని వేధింపులకు గురిచేస్తోంది వైసీపీ.
ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇప్పటం గ్రామస్తులకు అండగా నిలిచిన సంగతి తెలిసిందే. త్వరలో జనసేన పార్టీ మచిలీపట్నంలో ఆవిర్భావ సభ నిర్వహించనుంది. అక్కడ జనసేనకు స్థానిక ప్రజానీకం నుంచి సహకారం లభించకూడదన్న కోణంలో ఇప్పటం గ్రామస్తుల్ని ఇంకోసారి వేధించడం మొదలు పెట్టింది వైసీపీ ప్రభుత్వం.
‘నాశనమైపోతారు.. పుట్టగతుల్లేకుండా పోతారు..’ అంటూ ఇప్పటం గ్రామస్తులు, అధికారులపైనా, ప్రభుత్వ పెద్దలపైనా దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పటం గ్రామంలో జనసేన నేత ఇంటిని లక్ష్యంగా చేసుకుని విధ్వంసాలకు దిగారు అధికారులు. దాంతో, జనసేన నేతలు రంగంలోకి దిగారు.
మరోపక్క, ఇప్పటం గ్రామ పరిస్థితిని పార్టీ ముఖ్య నేతలు, అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలుస్తోంది. ఇప్పటం గ్రామాన్ని ఇంకోసారి సందర్శించడమా.? ఇప్పటం గ్రామస్తుల్ని మచిలీపట్నం సభకు తీసుకు రావడమా.? అన్నదానిపై జనసేన నేతలు చర్చోపచర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
816672 868494What a lovely weblog page. I will surely be back once more. Please maintain writing! 519843