Switch to English

సై’కిల్‘కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ రిపేర్ చేయగలడా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ఈ రోజుల్లో సినీ నటులు రాజకీయ పార్టీ పెట్టడమో, రాజకీయ పార్టీని నడపాల్సి రావడమో అంటే చేతులు కాల్చుకోవడం కిందే లెక్క. ఆ విషయం ఇంకోసారి నిరూపితమయ్యింది. మెగాస్టార్‌ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి చెప్పుకోదగ్గ సీట్లు, ఓట్లు సాధించినా, అధికారంలోకి రాలేకపోయారు.. రాజకీయాల్లో ఎక్కువ కాలం మనుగడ సాధించలేకపోయారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ పరిస్థితి మరీ దారుణం. పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారాయన. గుడ్డిలో మెల్ల అన్నట్లు జనసేన నుంచి ఒక్క అభ్యర్థి మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచారు తాజా ఎన్నికల్లో. ఇలాంటి పరిస్థితుల్లో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, ‘పార్టులు ఊడిపోయిన’ సైకిల్‌ పార్టీని రిపేర్‌ చేయగలడా?

తెలుగుదేశం పార్టీకి కొత్త రధ సారధి కావాలంటూ పార్టీ శ్రేణుల్లో అభిప్రాయాలు పోటెత్తుతున్నాయి. చంద్రబాబుకి వయసు అయిపోయిందనీ, ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఇకపై ముందడుగు వేయలేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కొందరు నందమూరి బాలకృష్ణకు పార్టీ పగ్గాలు అప్పగించాలని కోరుతోంటే, మరికొందరు యంగ్‌ టైగర్‌కి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు అప్పగిస్తే బెటరని అంటున్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు మాత్రం తమ అభిమాన హీరో ‘రాజకీయ మరక’ అంటించుకోకపోవడమే మంచిదని భావిస్తుండడం గమనార్హం. అయితే, ఆ అభిమానుల్లోనూ కొందరు తమ అభిమాన హీరోని రాజకీయ తెరపై చూడాలని కోరుకుంటుండడం ఇంకా ఆసక్తికరమైన అంశం.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ల సోదరి నందమూరి సుహాసిని కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగడం వెనుక చంద్రబాబు ‘కుట్ర’ కోణం అందరికీ తెలిసిందే. హరికృష్ణ కుమార్తెను అక్కడ చంద్రబాబే ఓడించారు. అసలు ఆమె పోటీ చేయకుండా వుండి వుంటే ఇంకోలా వుండేది. టీడీపీ గెలిచేదని కాదు, నందమూరి కుటుంబం తాలూకు గౌరవ మర్యాదల్ని మంటగలిపేసింది ఆ ఎన్నిక. ఆ ఓటమి అంత ఖరీదైనది మరి. సోదరి ఓటమిని ముందే ఊహించినా ఏమీ చేయలేని పరిస్థితి కళ్యాణ్‌రామ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌లది.

తెలుగుదేశం పార్టీ పూర్తిగా కుళ్ళిపోయిన ఈ పరిస్థితుల్లో ఆ కుళ్ళును కడగడం బాలకృష్ణకైనా, యంగ్‌ టైగర్‌కి అయినా చాలా కష్టమైన పనే. అసాధ్యమైతే కాదుగానీ, ఆ కుళ్ళుని కడిగే క్రమంలో బాలయ్య, ఎన్టీఆర్‌ ఎంతో కొంత దాన్ని అంటించుకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ బాలయ్యకు అది అంటేసింది. జూనియర్‌ ఎన్టీఆర్‌ మాత్రం దూరంగా వున్నాడు. చంద్రబాబుని కాదని బాలయ్య బయటకు వస్తే, బాబాయ్‌ బాలయ్యకు అన్ని విధాలా అండగా వుండేందుకు యంగ్‌ టైగర్‌ సదా సిద్ధం.

తాజా ఎన్నికలకు ముందు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ మామగారు నార్నె శ్రీనివాసరావు అత్యంత వ్యూహాత్మకంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అలా జూనియర్‌ ఎన్టీఆర్‌, వైసీపీ సానుభూతిపరుల నుంచీ సాఫ్ట్‌ కార్నర్‌ అందుకున్నాడు. దాన్ని ఇప్పటికిప్పుడు యంగ్‌ టైగర్‌ చెడగొట్టుకునే అవకాశమే లేదు. పవన్‌కళ్యాణ్‌, జనసేన పార్టీతో ఏమీ సాధించలేకపోయారు గనుక, యంగ్‌ టైగర్‌ ఇప్పుడు ఏమాత్రం రిస్క్‌ చేయాల్సిన పనిలేదు. అభిమానం వేరు, రాజకీయం వేరు. రాజకీయాల్లో ఈక్వేషన్స్‌ వేరేలా వుంటాయి. ఆ దెబ్బని ఆల్రెడీ చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌ రుచిచూసేశారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...