మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక ప్యాన్ ఇండియన్ చిత్రం విడుదలైన విషయం తెల్సిందే. ఈ అనౌన్స్మెంట్ వచ్చి చాలా కాలమే అయింది కానీ దీనికి సంబంధించిన సరైన అప్డేట్ అన్నది లేదు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఖుషి చేసేలా నిర్మాతలు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలుకాబోతోంది అన్నదానిపై క్లారిటీ ఇచ్చారు.
అవును, ఏప్రిల్ 2024 నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని అధికారికంగా ఈరోజు ప్రకటించారు నిర్మాతలు. దేవర రిలీజ్ తర్వాత రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. దేవర మొదటి భాగం ఏప్రిల్ 5, 2023న విడుదల కానున్న నేపథ్యంలో ఆ నెలాఖరు నుండి షూటింగ్ మొదలవ్వొచ్చు.
ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ పార్ట్ 1 డిసెంబర్ 22, 2023న విడుదలవుతోన్న విషయం తెల్సిందే. మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్, నీల్ చిత్రాన్ని నిర్మించనుంది.