నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్న వేళ.. కోవిడ్ ఉధృతి దృష్ట్యా విజయోత్సవ ర్యాలీలను నిషేధించింది కేంద్ర ఎన్నికల సంఘం. కానీ.. నేడు అనేకచోట్ల గెలిచిన పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. దీంతో ర్యాలీలు, సంబరాలు చేసుకున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికలు జరిగిన రాష్ట్రాల సీఎస్ లను ఆదేశించింది. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని.. సంబంధిత పోలిస్ స్టేషన్ పరిధిలోని ఎస్ హెచ్ఓను సస్పెండ్ చేయాలని కూడా ఆదేశించింది.
ఇటివల సిఈసీ వెలువరచిన ఆదేశాల ప్రకారం.. గెలిచిన అభ్యర్ధులు, కార్యకర్తలు ఎటువంటి సంబరాలు జరపకూడదు. గెలిచిన అభ్యర్ధులు సైతం రిటర్నింగ్ అధికారి వద్దకు వెళ్లి ధ్రువీకరణ పత్రాలు తీసుకునే సమయంలో వారి వెంట ఇద్దరికి మించి ఉండరాదు. లెక్కింపు కేంద్రాలకు వెళ్లే సమయంలో అభ్యర్ధులు కరోనా నెగటివ్ రిపోర్టు తప్పనిసరి. ఇన్ని ఆదేశాలిచ్చినా చాలా చోట్ల కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.
147767 9513Taylor Lautner By the way you may want to check out this cool website I found 85678
335870 131209Sweet web site , super pattern , rattling clean and use friendly . 470935