ఆంధ్రప్రదేశ్లో తిరుగులేని మెజార్టీతో అధికారం దక్కించుకుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పదవీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరవుతారనీ, ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో అనుకున్నది సాధించిన వైఎస్ జగన్, తదుపరి తెలంగాణాపై దృష్టి పెడతారట. అయితే, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీలో జగన్ గెలుపును ముందే ఊహించి, తెలివిగా ఫెడరల్ ఫ్రంట్లోకి వైఎస్ జగన్ని ఆహ్వానించారు. తద్వారా తెలంగాణాలో జగన్ నుండి తనకు థ్రెట్ లేకుండా చూసుకున్నారు కేసీఆర్.
జగన్ ప్రభంజనం ఎలా ఉంటుందో కేసీఆర్కి ముందే తెలుసు. 2014 ఎన్నికల సందర్భంలోనే జగన్ ప్రభంజనంపై కేసీఆర్ అంచనాలు ఆకాశంలో ఉండేవి. అయితే, అప్పట్లో ఆ అంచనాలు బెడిసికొట్టాయి. జగన్ సమైక్యాంధ్రకు జై కొట్టినా, తెలంగాణాలో ఓ ఎంపీ సీటు, రెండు మూడు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నారు. ఆ తర్వాత వాటిని కేసీఆర్ లాగేసుకున్నారు. మరి జగన్, కేసీఆర్కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో పరోక్షంగా టీఆర్ఎస్కి వైసీపీ మద్దతిచ్చింది. కానీ, ఇకపై రాజకీయాలు వేరే లెవల్లో ఉంటాయి. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కోమటిరెడ్డి, లోక్సభ ఎన్నికల్లో గెలిచారు. ఇప్పటికి కాంగ్రెస్లోనే ఉన్నా, వైఎస్ జగన్ పట్ల అమితమైన ప్రేమను చాటుకున్నారాయన.
తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ఉనికి ప్రశ్నార్ధకంగా మారుతున్న వేళ కాంగ్రెస్ నేతలు వైఎస్ జగన్ వైపు చూసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే జరిగితే, తెలంగాణాలో కేసీఆర్కి వైఎస్ జగన్ రూపంలో రాజకీయంగా థ్రెట్ తప్పదు. అయితే, ఇప్పటికిప్పుడు జగన్ అంత ఎగ్రసివ్గా తెలంగాణాలో రాజకీయాలు చేస్తారనీ అనుకోలేం. ఓ రెండేళ్లదాకా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ పైనే జగన్ ఫోకస్ ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు పరిష్కారాలు వెతకాలి. రాష్ట్ర ప్రజలకు మెరుగైన పాలన అందించగలగాలి. రెండు, మూడేళ్లు ఆగ్నిపరీక్షనే ఎదుర్కోవాలి వైఎస్ జగన్.
ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్ వీటిన్నింటినీ ఓ కొలిక్కి తెచ్చి మరింత బలం పుంజుకుంటే, ఆ తర్వాత తెలంగాణాలోనూ చక్రం తిప్పడానికి మార్గం సులభతరమవుతుంది. ఈ లోగా తెలంగాణాలో పార్టీని విస్తరించే ప్రక్రియ చాప కింద నీరులా ప్రారంభించాల్సి ఉంటుంది. కొండా సురేఖ, సబితా ఇంద్రారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నాల లక్ష్యయ్య ఇలాంటి వైఎస్ సానుభూతిపరులు జగన్ వైపుకు తిరగడానికి పెద్దగా టైమ్ పట్టదు. ఇంకో ఏడాదిలోనే తెలంగాణా రాజకీయాల్లో వైసీపీ ఉనికి కనిపిస్తుందని కాంగ్రెస్లోని వైసీపీ సానుభూతిపరులు చెబుతున్నారు. దానర్ధం తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగా మారబోతోందనేనేమో.
142079 628441Outstanding post, I conceive men and women ought to larn a whole lot from this internet web site its genuinely user genial . 156154
897621 661036I surely did not realize that. Learnt some thing new these days! Thanks for that. 404368
329902 296048I conceive this site has got some real wonderful info for everyone : D. 615723
855324 500951I enjoy the useful details you offer in your articles. 689154