రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో కొత్త జిల్లాలను ప్రభుత్వం ప్రకటించింది. కాని ఏపీలో మాత్రం చంద్రబాబు నాయుడు కొత్త జిల్లాల విషయమై శ్రద్ద పెట్టలేదు. జగన్ ఎన్నికల సమయంలో కొత్త జిల్లాలను ప్రకటిస్తాం అంటూ హామీ ఇచ్చాడు. అన్నట్లుగానే కొత్త జిల్లాల ఏర్పాటు విషయమై అధికారులను హడావుడి చేస్తున్నారు. ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీలు సంఘాలు వేసిన ప్రభుత్వం జనవరి నుండి కొత్త జిల్లాలకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల నుండి సమాచారం అందుతోంది.
ఏపీ రాజకీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం వచ్చేఏడాది రిపబ్లిక్ డే సందర్బంగా కొత్త జిల్లాల నుండి కీలకమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది అంటున్నారు. ఇప్పటికే 25 లేదా 26 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాధనలు వచ్చాయి. ఆ జిల్లాలకు సంబంధించిన జిల్లా కేంద్రాలను మరియు పరిపాలన భవనాలను పరిశీలించే పనిలో అధికారులు ఉన్నారు. కొత్త జిల్లాలను రిపబ్లిక్ డే రోజున అమలులోకి తీసుకు రావడం లేదా కనీసం కొత్త జిల్లాలను ప్రకటించడం అయినా చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.