ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే అందరికీ వెటకారం అయిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఆంధ్రప్రదేశ్కి మూడు రాజధానులంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి సాక్షాత్తూ అసెంబ్లీలో చేసిన ప్రకటనతో పెను దుమారం రేగుతున్న విషయం విదితమే. ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పడుతున్నాయి. ‘నేను కొత్తగా ఇల్లు కట్టాలనుకుంటున్నాను.. బాత్రూమ్ బాపట్లలో, బెడ్ రూమ్ బెజవాడలో, కిచెన్ కాకినాడలో కడితే ఎలా వుంటుందంటారు.? మన రాజధానిలా!’ అంటూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది.
ఇలాంటివి చాలానే సెటైర్లు ఆంధ్రప్రదేశ్ రాజధానిపై పడుతున్నాయి. నిజానికి, ఇది సిగ్గు పడాల్సిన సందర్భం. రాష్ట్రానికి వున్న పళంగా ఓ రాజధాని అవసరం. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా శంకుస్థాపన చేసిన అమరావతిని, కేంద్రం గుర్తించకపోవడం అప్పట్లో వివాదానికి కారణమయ్యింది. ఎలాగైతేనేం, రాష్ట్రం నుంచి వెల్లువెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో ఎట్టకేలకు అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కేంద్రం గుర్తించింది. ఇంతలోనే వైఎస్ జగన్ మోహన్రెడ్డి బాంబు పేల్చారు.
దాంతో రాజధాని కాస్తా మూడు ముక్కలయ్యేలా వుంది. నిజానికి, మూడు ముక్కల వ్యవహారం కాదు. విశాఖ రాజధాని కాబోతోంది.. అమరావతి, కర్నూలు డమ్మీ రాజధానులుగా వుంటాయి. మరి, కేంద్రం వీటిల్లో దేన్ని రాజధానిగా గుర్తిస్తుంది.? మూడిటినీ కేంద్రం నోటిఫై చేస్తుందా.? విశాఖ లోక్సభ నియోజకవర్గం నుంచి గతంలో విజయమ్మను బరిలోకి దింపినప్పుడే వైఎస్ జగన్, రాజధాని విషయమై ఓ స్పష్టతతో వున్నారనీ.. ఇప్పుడు తనకు అవకాశం వచ్చింది గనుక.. ఈ బాంబు పేల్చారనీ విన్పిస్తున్న వాదనల్లో నిజం లేదని ఎలా అనుకోగలం.?
724768 334340As I web site owner I believe the content material here is really superb, thanks for your efforts. 918088
740697 868681U never get what u expect u only get what u inspect 45522
656914 213101 I discovered your weblog site on google and check a couple of of your early posts. Continue to maintain up the extremely excellent operate. I just additional up your RSS feed to my MSN News Reader. Seeking forward to reading far more from you later on! 745074