Switch to English

వైసీపీ ఎంపీలు విశాఖను పంచుకున్నారు.! అంతేగా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ఇది క్లియర్.! వైసీపీ ఎంపీలు విశాఖపట్నం నగరాన్ని పంచుకున్నారు.! ఇదే చర్చ ఇప్పుడు విశాఖ జనాల్లో జరుగుతోంది. వైసీపీ అధికారంలోకి రాకముందు నుంచే విశాఖ మీద వైసీపీ కన్నేసిందన్న విమర్శ వుంది. విశాఖపై కన్నేయబట్టే, వైసీపీ అధినాయకత్వం.. వైఎస్ విజయమ్మను విశాఖ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దింపిందట 2014 ఎన్నికల్లో.

2014 నుంచి 2019 వరకు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకున్న వైసీపీ, 2019 ఎన్నికల్లో అధికారంలోకి రాగానే, విశాఖను పంచుకునేందుకు మార్గం సుగమం చేసుకున్నట్లుగా విశాఖ జనాలు ఓ నిర్ణయానికి వచ్చేశారు. నిన్న మొన్నటిదాకా ఇదంతా కేవలం రాజకీయ విమర్శ మాత్రమే. ఇప్పుడది వాస్తవమని తేలిపోతోంది. రాజకీయ ప్రత్యర్థులు చేస్తే అవి రాజకీయ ఆరోపణలు. అదే, పంపకాల్లో తేడాలు వచ్చి, అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తే.. జరిగిన కుంభకోణం నిజమేనని అర్థం కదా.?

వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిది విశాఖపట్నం కాదు. కానీ, ఆయన విశాఖపట్నం కేంద్రంగా రాజకీయాలు చేస్తుంటారు. గతంలో ఉత్తరాంధ్రపై మొత్తం పెత్తన్నాన్ని విజయసాయిరెడ్డికి అధినేత వైఎస్ జగన్ కట్టబెట్టారు. ఆ తర్వాత ఆ పెత్తనం ఆయన చేతుల్లోంచి జారిపోయిందనుకోండి.. అది వేరే సంగతి.

అయినాగానీ, ఉత్తరాంధ్ర వైసీపీ రాజకీయాలు ఇంకా విజయసాయిరెడ్డి కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. వైసీపీ విశాఖ లోక్‌సభ సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణ ఫక్తు రాజకీయ నాయకుడేం కాదు. ఆయన సినీ నిర్మాత, రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయనకు విశాఖ టిక్కెట్ దక్కడంపై అప్పట్లోనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ అనుమానాలు ఇప్పుడు నిజమయ్యాయి.

దసపల్లా భూముల్ని విజయసాయిరెడ్డి కుటుంబం సొంతం చేసుకుంటే, చిత్ర విచిత్రమైన అగ్రిమెంట్లతో ఎంవీవీ సత్యనారాయణ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులతో కోట్లు గడిస్తున్నారు.. వెరసి.. ఇద్దరూ విశాఖ భూముల్ని పంచుకుంటున్నారన్నమాట. ఎంపీలు ఇలా భూ దందా చేస్తోంటే, మిగతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు చూస్తూ ఊరుకుంటారా.? తలో కొంతా పండగ చేసుకోరూ.? అన్నది వేరే చర్చ.

విశాఖపై వాలిన వైసీపీ గద్దలు.. అంటూ గతంలోనే ప్రచారం జరిగింది. ‘రియల్ ఎస్టేట్ పంచాయితీలు.. భూ వివాదాలకు సంబంధించిన ఇతర పంచాయితీలు’ ‘సీమ రౌడీలతో’ ఎలా అధికార పార్టీ నేతలు నిర్వహించిందీ గతంలో మీడియాలో కథనాలు వచ్చాయి. ఎంవీవీ సత్యనారాయణ తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తోంటే, అందులో విజయసాయిరెడ్డి మీద చేస్తున్న ఆరోపణలు చూస్తోంటే.. గతంలో వచ్చిన మీడియా కథనాలు నిజమేనని అనిపించకమానదు.

ఇంత జరుగుతున్నా.. అధికార పార్టీకే చెందిన ఇద్దరు ఎంపీలు విశాఖని పంచుకున్నారనే విషయం బయటపడినా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏం చేస్తున్నట్టు.? అవినీతికి తావు లేని పాలన.. అంటున్నారు కదా.? అవినీతి అనే మాటకు అర్థం ఏమన్నా మార్చేసుకున్నారా ఏంటి.? అని విశాఖ జనం ప్రశ్నిస్తున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...