ఇది క్లియర్.! వైసీపీ ఎంపీలు విశాఖపట్నం నగరాన్ని పంచుకున్నారు.! ఇదే చర్చ ఇప్పుడు విశాఖ జనాల్లో జరుగుతోంది. వైసీపీ అధికారంలోకి రాకముందు నుంచే విశాఖ మీద వైసీపీ కన్నేసిందన్న విమర్శ వుంది. విశాఖపై కన్నేయబట్టే, వైసీపీ అధినాయకత్వం.. వైఎస్ విజయమ్మను విశాఖ నుంచి లోక్సభ ఎన్నికల బరిలోకి దింపిందట 2014 ఎన్నికల్లో.
2014 నుంచి 2019 వరకు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకున్న వైసీపీ, 2019 ఎన్నికల్లో అధికారంలోకి రాగానే, విశాఖను పంచుకునేందుకు మార్గం సుగమం చేసుకున్నట్లుగా విశాఖ జనాలు ఓ నిర్ణయానికి వచ్చేశారు. నిన్న మొన్నటిదాకా ఇదంతా కేవలం రాజకీయ విమర్శ మాత్రమే. ఇప్పుడది వాస్తవమని తేలిపోతోంది. రాజకీయ ప్రత్యర్థులు చేస్తే అవి రాజకీయ ఆరోపణలు. అదే, పంపకాల్లో తేడాలు వచ్చి, అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తే.. జరిగిన కుంభకోణం నిజమేనని అర్థం కదా.?
వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిది విశాఖపట్నం కాదు. కానీ, ఆయన విశాఖపట్నం కేంద్రంగా రాజకీయాలు చేస్తుంటారు. గతంలో ఉత్తరాంధ్రపై మొత్తం పెత్తన్నాన్ని విజయసాయిరెడ్డికి అధినేత వైఎస్ జగన్ కట్టబెట్టారు. ఆ తర్వాత ఆ పెత్తనం ఆయన చేతుల్లోంచి జారిపోయిందనుకోండి.. అది వేరే సంగతి.
అయినాగానీ, ఉత్తరాంధ్ర వైసీపీ రాజకీయాలు ఇంకా విజయసాయిరెడ్డి కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. వైసీపీ విశాఖ లోక్సభ సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణ ఫక్తు రాజకీయ నాయకుడేం కాదు. ఆయన సినీ నిర్మాత, రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయనకు విశాఖ టిక్కెట్ దక్కడంపై అప్పట్లోనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ అనుమానాలు ఇప్పుడు నిజమయ్యాయి.
దసపల్లా భూముల్ని విజయసాయిరెడ్డి కుటుంబం సొంతం చేసుకుంటే, చిత్ర విచిత్రమైన అగ్రిమెంట్లతో ఎంవీవీ సత్యనారాయణ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులతో కోట్లు గడిస్తున్నారు.. వెరసి.. ఇద్దరూ విశాఖ భూముల్ని పంచుకుంటున్నారన్నమాట. ఎంపీలు ఇలా భూ దందా చేస్తోంటే, మిగతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు చూస్తూ ఊరుకుంటారా.? తలో కొంతా పండగ చేసుకోరూ.? అన్నది వేరే చర్చ.
విశాఖపై వాలిన వైసీపీ గద్దలు.. అంటూ గతంలోనే ప్రచారం జరిగింది. ‘రియల్ ఎస్టేట్ పంచాయితీలు.. భూ వివాదాలకు సంబంధించిన ఇతర పంచాయితీలు’ ‘సీమ రౌడీలతో’ ఎలా అధికార పార్టీ నేతలు నిర్వహించిందీ గతంలో మీడియాలో కథనాలు వచ్చాయి. ఎంవీవీ సత్యనారాయణ తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తోంటే, అందులో విజయసాయిరెడ్డి మీద చేస్తున్న ఆరోపణలు చూస్తోంటే.. గతంలో వచ్చిన మీడియా కథనాలు నిజమేనని అనిపించకమానదు.
ఇంత జరుగుతున్నా.. అధికార పార్టీకే చెందిన ఇద్దరు ఎంపీలు విశాఖని పంచుకున్నారనే విషయం బయటపడినా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏం చేస్తున్నట్టు.? అవినీతికి తావు లేని పాలన.. అంటున్నారు కదా.? అవినీతి అనే మాటకు అర్థం ఏమన్నా మార్చేసుకున్నారా ఏంటి.? అని విశాఖ జనం ప్రశ్నిస్తున్నారు.
31898 185547Should you happen to significant fortunate people forms, referring by natural indicates, moreover you catch the attention of some sort of envy in consideration of those types the other campers surrounding you which have tough times about this subject. awnings 381330
105029 384773There is numerous separate years Los angeles Weight reduction eating plan with each a person is actually a necessity. The pioneer part can be your original getting rid of belonging to the extra pounds. la weight loss 287829