వైసీపీ ప్రముఖ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి కొంత ఊరట కలిగించే విషయం ఇది. విదేశాలకు వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని ఆయన కోరగా అక్టోబర్ లోగా రెండు వారాలు విదేశాలకు వెళ్లందుకు సీబీఐ కోర్టు అనుమతులు ఇచ్చింది. 5 లక్షల రూపాయల చొప్పున ఇద్దరి పూచికత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
దుబాయ్, బాలి, మాల్దీవులకు తీర ప్రాంత అభివృద్ధిపై అధ్యయనం చేసేందుకు వెళ్తున్నట్లు విజయసాయిరెడ్డి కోర్టుకు తెలియజేసారు. ఇదిలా ఉంటే మరోకేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి మంజూరు చేసిన బెయిల్ ను రద్దుచేయాలని వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటీషన్ దాఖలు చేయగా సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పు వెలువరిస్తుందన్న వార్తల నేపథ్యంలో నాంపల్లి కోర్టు వద్ద హైడ్రామా నడిచింది.
అయితే తీవ్ర ఉత్కంఠల నడుమ తీర్పును సెప్టెంబర్ 15కి వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.
848929 432132Thank you for your amazing post! It has long been incredibly useful. I hope that you will proceed sharing your wisdom with us. 300337