సామాజిక మాధ్యమాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఉండే ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. ఆయనకు ట్విటర్లో 46.6 మిలియన్ల మంది ఫాలోవర్లున్నారు. ఆయన బుధవారం ఉదయం 11:45గంటలకు జాతినుద్దేశించి మాట్లాడనున్నట్లు ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ విషయంపై మోదీ ఉదయం 11:23గంటలకు ఈ ట్వీట్ చేశారు. అయితే అప్పటి నుంచి ఈ ట్వీట్ బాగా వైరల్ అయింది. ఈ ట్వీట్ పెట్టిన నిమిషాల వ్యవధిలో దీనికి వేలల్లో లైకులొచ్చాయి. అంతేకాకుండా మోదీ చెప్పబోయే విషయం ఏమై ఉంటుందా! అని దీనిపై విస్తృతంగా చర్చ జరిగింది. దీన్ని పోస్ట్ చేసిన వెంటనే నిమిషానికి 1,000 చొప్పున లైకులొచ్చాయి.
అయితే 2016 నవంబరు 8న ఇదే తరహాలో ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నట్లు ముందే ప్రకటించారు. అనంతరం నల్లధనాన్ని అరికట్టడంలో భాగంగా రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. అటువంటిదే ఇప్పుడు కూడా మరోసారి ఇలాంటి కీలక ప్రకటన ఏదైనా చేస్తారేమోనని నెటిజన్లు ఆతృతగా ఎదురు చూశారు.
ముందుగా చెప్పినట్లు ప్రధాని మోదీ జాతి ప్రజలకు ముఖ్యమైన విషయాన్ని చెప్పారు. అంతరిక్షంలో భారత్ అద్భుతమైన విజయం సాధించిందని మోదీ తెలిపారు. అత్యంత కఠినమైన మిషన్ శక్తి ఆపరేషన్ను విజయవంతంగా పూర్తిచేసి, అంతరిక్ష శక్తిసామర్థ్యాల్లో భారత్ అగ్రదేశాల సరసన చేరిందని కొనియాడారు.
‘మిషన్ శక్తి అనేది అత్యంత కఠినమైన ఆపరేషన్. దీని ద్వారా అంతరిక్షంలో శాటిలైట్ను పడగొట్టాం. ఏ శాట్(యాంటీ శాంటిలైట్) క్షిపణిని భారత్ విజయవంతంగా ప్రయోగించింది. కక్ష్యలో ఇది తక్కువ ఎత్తులోని తిరుగుతున్న ఒక శాటిలైట్ను కేవలం 3 నిమిషాల్లోనే కూల్చేసింది. భారత అభివృద్ధి పథంలో ఇదో గొప్ప మైలురాయి’ అని మోదీ తెలిపారు.
मेरे प्यारे देशवासियों,
आज सवेरे लगभग 11.45 – 12.00 बजे मैं एक महत्वपूर्ण संदेश लेकर आप के बीच आऊँगा।
I would be addressing the nation at around 11:45 AM – 12.00 noon with an important message.
Do watch the address on television, radio or social media.
— Chowkidar Narendra Modi (@narendramodi) March 27, 2019