‘రాజకీయాల విషయంలో చిరంజీవిగారిని చూసి నేనొకటి తెలుసుకున్నాను.. అదేంటంటే, రాజకీయాలకు దూరంగా వుండాలని..’ అంటూ ‘సైరా నరసింహారెడ్డి’లో నటిస్తోన్న కన్నడ నటుడు సుదీప్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. అయితే, ఆ వ్యాఖ్యల వెనుక అసలు కారణం వేరే వుంది. ‘సైరా నరసింహారెడ్డి’ షూట్ సందర్భంగా చిరంజీవి, సుదీప్ మధ్య చాలా అంశాలపై చర్చ వచ్చినట్లుగానే, రాజకీయాల గురించిన ప్రస్తావన కూడా జరిగిందట.
ఈ క్రమంలోనే చిరంజీవి, ‘రాజకీయాలొద్దు బ్రదర్..’ అంటూ సుదీప్కి సూచించారట. సుదీప్కి మాత్రమే కాదు, తన స్నేహితులైన ప్రముఖ తమిళ హీరోలు కమల్హాసన్, రజనీకాంత్లకూ చిరంజీవి ఇదే తరహా సలహా ఇచ్చారట. ‘ఇప్పుడు డబ్బుతోనే రాజకీయాలు నడుస్తున్నాయి. రాజకీయాల్లో సినిమా గ్లామర్ పనిచేయదు. ప్రజల్ని తప్పు పట్టలేం. రాజకీయ వ్యవస్థ ఇప్పుడు గతంలోలా లేదు. మన చుట్టూ వున్నవారే, మనకి శతృవులైపోతారు రాజకీయాల కారణంగా. ఆ విషయాన్నే నేను రాజకీయాల్లోకి వెళ్ళి తెలుసుకున్నాను. నేను రాజకీయాల్ని వదిలేసుకున్నది అందుకే. నా తమ్ముడు పవన్ కళ్యాణ్కీ ఇదే చెప్పాను. కానీ, నన్ను కాదని ధైర్యంగా ముందడుగు వేశాడు పవన్ కళ్యాణ్. డబ్బు కారణంగానే మేమిద్దం రాజకీయాల్లో ఓటమి చవిచూశాం..’ అని చిరంజీవి, అటు రజనీకాంత్కీ.. ఇటు కమల్హాసన్కీ సూచించారట ఈ మధ్యనే.
కమల్హాసన్ ఇప్పటికే ఓ పార్టీ అధినేతగా తమిళ రాజకీయాల్లో హల్చల్ చేస్తోన్న విషయం విదితమే. రజనీకాంత్, వచ్చే ఏడాది రాజకీయ పార్టీని ప్రకటిస్తాడంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో చిరంజీవి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ కోసం పనిచేసిన పవన్ కళ్యాణ్, 2014 ఎన్నికల సమయంలో జనసేన పార్టీని సొంతంగా స్థాపించి, 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. పోటీ చేసిన రెండు చోట్లా పవన్ కళ్యాణ్ ఓడిపోయిన విషయం విదితమే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటుని జనసేన పార్టీ గెలుచుకుంది. చిరంజీవి మాటల్ని పరిగణనలోకి తీసుకుని వుండి వుంటే, పవన్ కళ్యాణ్ సినీ నటుడిగా.. తన కెరీర్లో మరింత దూసుకుపోయేవాడే.
241512 381022very great put up, i truly enjoy this web internet site, maintain on it 935259
971194 969627This really is some excellent data. I expect additional facts like this was distributed across the web today. 984394