వైకాపా ఎమ్మెల్యే రోజా అనారోగ్యం కారణంగా రెండు ఆపరేషన్ లు చేయించుకున్న విషయం తెల్సిందే. చెన్నైలోని మలర్ ఆసుపత్రిలో రోజాకు ఆపరేషన్ జరిగింది. రోజా ఆపరేషన్ విషయమై ఆమె అభిమానులు మరియు ఆమె నియోజక వర్గ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. రోజా ఆరోగ్యం బాగుండాలని నగరి వైకాపా నాయకులు మరియు కార్యకర్తలు పూజలు చేశారు. ఎట్టకేలకు రోజా ఆరోగ్యం విషయమై అధికారికంగా క్లారిటీ వచ్చింది. ఆమె భర్త సెల్వమణి స్పందిస్తూ రోజా ఆరోగ్యంగా ఉందని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయినట్లుగా చెప్పుకొచ్చాడు.
మేజర్ ఆపరేషన్ లు జరగడం వల్ల రోజా కాస్త నీరసంగా ఉన్నట్లుగా అనిపించారు. కుటుంబ సభ్యులతో తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఆమె పూర్తిగా కోలుకునేందుకు మరో రెండు మూడు వారాలు అయినా పడుతుందని వైధ్యులు అన్నారట. అందుకే చెన్నైలోని వారి ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటుందని సెలవమణి చెప్పారు. రోజా ఆరోగ్యంగా ఉన్నారనే వార్త ఆమె అభిమానులకు మరియు వైకాపా కార్యకర్తలకు ఆనందంను కలిగించింది.
86124 554408Some genuinely nice stuff on this internet internet site , I it. 14881