ప్రస్తుతం యూత్ అంతా ‘సామజవరగమన’ అంటూ తమ ప్రేయసి వెంట పడుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘అలా వైకుంఠపురములో’ నుంచి విడుదలైన ఈ పాట బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ‘అలా వైకుంఠపురములో’ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానీ ఈ చిత్ర టీం ఎవ్వరూ ఊహించని విధంగా ప్రమోషన్స్ ప్లాన్ చేశారు.
అసలు విషయంలోకి వెళితే అల్లు అర్జున్ అండ్ టీం 125 రోజుల ముందు నుంచే ఈ చిత్ర ప్రమోషన్స్ చేయాలని, ప్రతి 25 రోజులకి ఒక్కో పాట చొప్పున సినిమాలోని మొత్తం 5 పాటలని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అందులో భాగంగానే ఈ చిత్ర టీం సెకండ్ సాంగ్ ని దీపావళికి రిలీజ్ చేయనున్నారు. మొదటి పాట సూపర్బ్ మెలోడీగా నిలిచింది, కానీ సెకండ్ సాంగ్ మాత్రం అద్నరి చేత స్టెప్పులేయించే ఊర మాస్ సాంగ్ ని ప్లాన్ చేస్తున్నారు. అంతే కాకుండా ప్రతి రోజు ఈ చిత్ర టీం ఎదో ఒక ఆన్ సెట్ విశేషాలను రిలీజ్ చేసి సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉండాలని ప్లాన్ చేశారు. అనుకున్నట్టే ప్రతి రోజు ఈ చిత్ర టీం నుంచి ఎదో ఒక స్కూప్ రిలీజ్ అవుతూనే ఉంది.
అల్లు అర్జున్ సరసన రెండో సారి పూజ హెగ్డే జోడీ కడుతున్న ఈ సినిమాని చినబాబు – అల్లు అరవింద్ కలిసి నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న 3వ సినిమా కావడం వల్ల భారీ అంచనాల నడుమ జనవరి 12న రిలీజ్ కి సిద్ధమవుతోంది.
450658 38058This is going to be a terrific blog, would you be interested in doing an interview about just how you developed it? If so e-mail me! 699281
789620 242327As I site possessor I believe the subject material here is rattling amazing , appreciate it for your efforts. 190269