తెలంగాణలో 16సీట్లు ఖాయమని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఢంకాబజాయించి మరీ చెబుతున్నారు. 16 గెలిచి ఢిల్లీలో చక్రం తిప్పుతామని అన్ని ప్రచారసభల్లో ధీమా వ్యక్తం చేస్తున్నారు. పైకి చెబుతున్నా.. పార్టీకి పట్టుందని భావిస్తున్న కొన్నిచోట్ల ఎదురుగాలి ఉందనే విషయం కేసీఆర్కు అర్థమైంది. క్షేత్రస్థాయి పరిస్థితి ఆయన అంచనాలకన్నా దారుణంగా ఉందని బోధపడింది.
టీఆర్ఎస్ పార్టీకి అత్యంత కీలక స్థానమైన నిజామాబాద్లోనే టీఆర్ఎస్కు అనుకూల పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత నిజామాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీగా బరిలో ఉన్నారు. అందుకే ఇప్పుడు ఇందూరు తెలంగాణలోని హాట్సీట్లలో ఒకటి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇందూరు జిల్లా అంతటా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఘనవిజయం సాధించడంతో కవిత విజయం నల్లేరుమీద నడకే అనుకున్నారు. కానీ రైతులు భారీసంఖ్యలో నామినేషన్లు వేయడంతో కేసీఆర్కు ఎక్కడో చెడుసంకేతాలు అందాయి.
నిజామాబాద్లో కవిత గెలవడం.. ఆమెకు, కేసీఆర్కు అత్యంత అవసరం. మిగిలిన 15సీట్లు గెలిచి కవిత ఓడినా కేసీఆర్ ఓడినట్లే. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో తన ప్రతిష్ట మసకబారకుండా ఉండాలనే ఇక్కడ గెలవడం కవితకు తప్పనిసరి. పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ టీఆర్ఎస్ అభ్యర్థికి పరిస్థితి ప్రతికూలంగా మారుతోంది. అందుకే బిడ్డను గెలిపించుకునేందుకు నేరుగా కేసీఆర్ రంగంలోకి దిగారు.
ఇప్పటికీ టీడీపీ స్పష్టమైన ఓటుబ్యాంకున్న ఇందూరులో ఆ పార్టీ కేడర్పై కన్నేశారు. ఇందులో భాగంగానే.. రైతు ఓటర్లు ఎక్కువగా ఉన్న నిజామాబాద్ జిల్లాలో బలమైన రైతు నేత మండవ వెంకటేశ్వరరావును పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమయ్యారు. అన్ని పార్టీల నేతలు.. వారికి వారే ప్రగతిభవన్కో.. టీఆర్ఎస్ భవన్కో వచ్చి పార్టీలో చేరుతుంటే.. కేసీఆర్ మాత్రం కూతురి విజయం కోసం తనే స్వయంగా జూబ్లీహిల్స్లోని మండవ ఇంటికెళ్లి మరీ మాట్లాడారు. ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు.
నిజామాబాద్ జిల్లాలో గ్రామీణ నియోజకవర్గమైన డిచ్పల్లి నుంచి మండవ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఓసారి అర్బన్ ప్రాంతమైన నిజామాబాద్ టౌన్ నుంచి గెలిచారు. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మండవకు.. జిల్లాలో రైతు సంఘాలు, గ్రామీణ ప్రాంతాలపై పట్టుంది. ఇదే ఇప్పుడు తమకు సంజీవనిలా మారుతుందనేది కేసీఆర్ వ్యూహం. అందుకే ఇన్నాళ్లుగా మండవవైపు కన్నెత్తి చూడని కేసీఆర్ ఇప్పుడు ఏకంగా ఇంటికెళ్లి మరీ ఆహ్వానించారు.
కేసీఆర్ స్వయంగా ఆహ్వానించడంతో.. టీఆర్ఎస్లోకి చేరేందుకు మండవ వెంకటేశ్వర్రావు సిద్ధమయ్యారు. ఒకట్రెండురోజుల్లో అధికారికంగా చేరనున్నారు. టీడీపీకి తెలంగాణలో ముఖ్యనేతగా ఉన్న మండవ వెంకటేశ్వర్రావు టీఆర్ఎస్లో చేరుతుండడంతో నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్లో అధికార పార్టీకి బలం పెరగనుందనే అంచనాల్నునాయి.
శుక్రవారం ఉదయం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, పువ్వాడ అజయ్కుమార్ మండవ వెంకటేశ్వర్రావు ఇంటికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. టీఆర్ఎస్లో చేరేందుకు మండవ వెంకటేశ్వర్రావు సుముఖత వ్యక్తం చేయడంతో.. కేసీఆర్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లారు. పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారి తెలంగాణలోని ఎన్నికలలో టీడీపీ పోటీ చేయడంలేదు.
ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన కేడర్పై టీఆర్ఎస్ అధిష్టానం దృష్టి పెట్టింది. టీడీపీకి చెందిన అన్ని స్థాయిల్లోని నేతలను పార్టీలోకి తీసుకోవడంతోపాటు మిగిలున్న కేడర్ మద్దతు పొందేలా వ్యూహరచన చేసింది. మండవ రాక టీఆర్ఎస్కు కలిసొస్తుందా.. లేక ఔట్డేటెడ్ రాజకీయ నాయకుడైన మండవ సూచనను ప్రజలు పక్కనపెట్టేస్తారా అనేది మే 23వరకు చెప్పలేం.
72671 490154Just a smiling visitant here to share the enjoy (:, btw outstanding pattern . 676989
851329 93327Stay up the good work! 968558
844310 365129This is the proper blog for anybody who hopes to learn about this subject. You know a whole lot its almost tough to argue along (not that I really would wantHaHa). You definitely put a whole new spin for a topic thats been written about for years. Great stuff, just fantastic! 927205
486137 772583Hiya! awesome blog! I happen to be a everyday visitor to your web site (somewhat much more like addict ) of this website. Just wanted to say I appreciate your blogs and am seeking forward for far more to come! 514529
637790 394480Hey there! Very good stuff, do maintain us posted when you finally post something like that! 855423
468761 60515hi and thanks regarding the specific post ive genuinely been searching regarding this kind of information online for sum time these days hence thanks a whole lot 785776