ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాయి. పోలింగ్ ట్రెండ్ ను బట్టి వైఎస్సార్ సీపీ గెలుపు ఖాయమని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. పోలింగ్ రోజు మధ్యాహ్నం నుంచే చంద్రబాబు డీలా పడిపోవడం, ఆ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయకుండా తదుపరి రోజు మీడియాతో మాట్లాడటం, అప్పుడు కూడా గెలుపుపై ఏ మాత్రం నమ్మకం లేనట్టుగా వ్యవహరించడం.. ఇవన్నీ చూసి టీడీపీ ఓటమికి సిద్ధమైపోతుందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఎన్నికల్లో ఈవీఎంలు మొరాయించాయని, ఎన్నికల నిర్వహణలో ఈసీ దారుణంగా విఫలమైందని, ఏ గుర్తుకు ఓటేసినా అది ఫ్యాన్ కే పడుతోందంటూ చంద్రబాబు ఆరోపణలు చేశారు. దీనిపై తాము జాతీయ స్థాయిలో పోరాడతామని స్పష్టంచేశారు. అనంతరం రెండు రోజులపాటు హస్తినలో మకాం వేసి తన మిత్రపక్షాల నేతలతో సమావేశమయ్యారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం పేరుతో సమావేశం ఏర్పాటు చేసి, అందరితో కలిసి ఈవీఎంలపై పోరు ఉధృతం చేశారు. బ్యాలెట్ విధానమే మంచిదని, ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరితో తెలుగు తమ్ముళ్లలో ఆందోళన తారాస్థాయికి చేరింది. నిజంగానే తాము ఓడిపోతున్నామా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. తమ అధినేత ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ మథనపడ్డారు. మరోవైపు వైఎస్సార్ సీపీ కూడా బాబుపై విమర్శలు మొదలుపెట్టింది. ఓటమికి కారణాలు వెతుక్కునే పనిలో టీడీపీ అధినేత ఉన్నారంటూ ఎద్దేవా చేసింది. సరిగ్గా ఇదే సమయంలో నటుడు శివాజీ ఓ వీడియో విడుదల చేశారు. టీడీపీ గెలుపు ఖాయమని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. ప్రజలంతా పూర్తి ఏకపక్షంగా ఓట్లేశారని, అందువల్ల తెలుగుదేశం పార్టీ శ్రేణులు అనవసరంగా ఆందోళన చెంది, బీపీ పెంచుకోవద్దని పేర్కొన్నారు. టీడీపీ నేతలు కూడా బాబు వ్యూహాన్ని అర్థం చేసుకోలేకపోయారని వ్యాఖ్యానించారు.
అయితే, చంద్రబాబు తాజా చర్యల వెనుక పెద్ద స్కెచ్చే ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన ఆయన.. ఏం చేసినా అందులో ఏదో కీలక అంశం ఉంటుందని పేర్కొంటున్నారు. ఫలితాల విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్న నేపథ్యంలో ఆయన చక్కని ప్లాన్ వేసుకుని, అందుకు తగ్గట్టుగా ముందుకు వెళుతున్నారని అంటున్నారు. రాష్ట్రంలో ఆయన లక్ష్యం.. వైఎస్సార్ సీపీని ఓడించి అధికారాన్ని నిలబెట్టుకోవడం. ఈ విషయంలో తేడా కొట్టిందనే అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో బాబు అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. ఇక తదుపరి తన లక్ష్యం.. ప్రధాని మోదీ. ఎట్టి పరిస్థితుల్లోనూ జాతీయ స్థాయిలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కానీయకుండా చేయడమే ధ్యేయంగా చంద్రబాబు కసరత్తు ప్రారంభించినట్టు అర్థమవుతోంది.
గత ఎన్నికల్లో ఎన్డీఏలో భాగస్వామ్యం పక్షంగా పోటీచేసిన చంద్రబాబు.. ఏడాది క్రితం బయటకు వచ్చేశారు. అప్పటినుంచి బీజేపీతోపాటు మోదీ, అమిత్ షాలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో అమిత్ షా కూడా తమ వైఖరి స్పష్టంచేశారు. చంద్రబాబుకు ఎన్డీఏ తలుపులు మూసేశామని చెప్పారు. దీంతో ఎన్నికలు అయ్యాక ఆయన ఎన్డీఏ వైపు వెళ్లే అవకాశం లేనట్టే.
పైగా మోదీ, అమిత్ షాలను విపరీతంగా విమర్శించిన నేపథ్యంలో వారు మళ్లీ అధికారంలోకి వస్తే తనను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని చంద్రబాబు భావిస్తున్నారు. రాష్ట్రంలోనైనా, కేంద్రంలోనైనా ఎక్కడో ఒకచోట తాము అధికారంలో ఉంటే ఎలాంటి సమస్యలూ ఉండవన్నది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. రాష్ట్రంలో ఫలితం తేడా కొట్టినా, జాతీయ స్థాయిలో తన కనుసన్నల్లోని సర్కారు ఉండాలని బాబు అభిలషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈవీఎంల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి, దేశవ్యాప్తంగా ప్రజల్ని బీజేపీని వ్యతిరేకించేటట్టు చేయాలన్నది ఆయన ప్రణాళిక అని పేర్కొంటున్నారు. మరి ఈ వ్యూహం ఎంతమేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
441272 604558I visited lots of website but I conceive this one contains something special in it in it 973935
731038 474406Really superb info can be discovered on weblog . 918804
66378 105284Outstanding post, I conceive internet site owners need to learn a great deal from this weblog its real user pleasant. 554466