Krish: హైదరాబాద్ రాడిసన్ హోటల్ డ్రగ్ వ్యవహారం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ (Tollywood) లో సైతం ప్రకంపనలు చెలరేగాయి. ఇందుకు దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్ (Krish) పేరు ఈ వ్యవహారంలో వెలుగులోకి రావడమే కారణం. క్రిష్ కూడా డ్రగ్స్ తీసుకున్నారని గచ్చిబౌలి పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
ఈ వ్యవహారంపై స్పందించిన క్రిష్ తాను డ్రగ్స్ తీసుకోలేదని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేయడంతో తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు రావాలని పోలీసులు కోరగా తాను ముంబైలో ఉన్నానని రెండు రోజులు సమయం కావాలని కోరుతూ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
ఇటివల విచారణకు హాజరైన క్రిష్ కు టెస్టులు నిర్వహించారు. ఇందులో నెగటివ్ వచ్చింది. దీంతో పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద పిటిషన్ ఉపసంహరించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. అనుమతించిన కోర్టు పిటిషన్ ను కొట్టిసింది.