Switch to English

జస్ట్‌ ఆస్కింగ్‌: రాములోరి విగ్రహానికి ఇన్సూరెన్స్‌ వుందా.? లేదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రధం దగ్ధమైతే, ‘ఇన్సూరెన్స్‌ వుందిగా..’ అంటూ అధికార పార్టీ నేతలు చాలా నిర్లక్ష్యంగా మాట్లాడారు. ఆ ఇన్స్యూరెన్స్‌ డబ్బులు వస్తాయని తెలిసీ, ప్రభుత్వ హడావిడిగా.. ఆ రధం స్థానంలో కొత్త రధాన్ని నిర్మించే ప్రక్రియ ప్రారంభించింది. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి.. కొత్త రధం కూడా తయారయ్యిందిగానీ, రధాన్ని తగలబెట్టిన ‘సంఘ విద్రోహ శక్తుల్ని’ మాత్రం ఇంతవరకూ పట్టుకోలేకపోయారు పోలీసులు.

తప్పు ఎక్కడ జరిగింది.? ఎక్కడ జరుగుతోంది.? ఇదొక్కటే ఇలాంటి ఘటన రాష్ట్రంలో జరిగితే.. అది వేరే సంగతి. కానీ, అంతకు ముందు రాష్ట్రంలో ఇంకో రథం తగలబడింది. చాలా దేవాలయాల్లో దేవతామూర్తుల విగ్రహాల్ని దుండగులు ధ్వంసం చేశారు. తాజాగా, విజయనగరం జిల్లా రామతీర్థం గుడిలో రాములోరి విగ్రహాన్ని ధ్వంసం చేశారు దుండగులు. శతాబ్దాల చరిత్ర కలిగిన రామతీర్థం దేవాలయం, రాష్ట్రంలోనే రెండో అతి ప్రాముఖ్యమైన రాములోరి క్షేత్రంగా విరాజిల్లుతోన్న విషయం విదితమే.

కొన్నాళ్ళ క్రితం ఓ దేవాలయంలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేస్తే, ‘విరిగింది బొమ్మ తాలూకు చెయ్యే కదా..’ అన్నారొక మంత్రిగారు. ఇది, రాష్ట్రంలో ప్రభుత్వ పాలనకు నిదర్శనంగా కనిపిస్తోంది. అక్కడ, హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. కానీ, మంత్రిగారికి మాత్రం.. దేవతా మూర్తుల విగ్రహాలంటే.. జస్ట్‌ బొమ్మల్లాగా కనిపిస్తున్నాయి. అదే, ముఖ్యమంత్రి మీద ఎవరన్నా విమర్శలు చేస్తే.. ‘ముఖ్యమంత్రి శివలింగం లాంటోడు..’ అంటూ అధికార పార్టీ నేతలు విరుచుకుపడిపోతారు.

ఒకటి కాదు.. రెండు కాదు.. హిందూ ధర్మంపై పనిగట్టుకుని కొందరు దాడికి పాల్పడుతున్న వైనం స్పష్టంగా కన్పిస్తోంది. దాన్ని అధికార పార్టీ నేతలు సమర్థిస్తున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. లేకపోతే, తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడకూడదు.. అన్యమత ప్రస్తావనే వుండకూడదు. కానీ, సాక్షాత్తూ మంత్రి ఒకరు అన్యమత పండుగకి సంబంధించి శుభాకాంక్షలు తిరుమల కొండపై చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.?

‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గత ఏడాదిన్నరగా దేవాలయాలపై దాడులు చేస్తూ, దేవతా విగ్రహాలను, రధాలను ధ్వంసం చేస్తున్న ఘటనలపై కేంద్ర హోంశాఖ దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నాం..’ అంటూ జనసేన అధినేత తాజాగా స్పందించారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఒకదాని తర్వాత ఒకటి.. వరుస ఘటనలు జరుగుతున్న దరిమిలా.. ఏ ఘటన జరిగినా, దానికి సంబంధించి దోషుల్ని రాష్ట్ర పోలీసులు పట్టుకోలేకపోతున్న దరిమిలా.. జనసేన కోరుతున్నట్లుగా.. కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవాల్సిందేనేమో!

అన్నట్టు, అయోధ్య రామ మందిరం నిర్మాణం జరుగుతున్న వేళ.. అంతటి ప్రాశస్త్యం కలిగిన రామతీర్థం దేవాలయంలోని రాములోరి విగ్రహం ధ్వంసమవడమంటే.. ఇది ఏమాత్రం చిన్న విషయం కాదు.. దీన్ని ఖచ్చిరతంగా హిందూ ధర్మంపై జరుగుతున్న దాడిగానే భావించాలి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...