అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రధం దగ్ధమైతే, ‘ఇన్సూరెన్స్ వుందిగా..’ అంటూ అధికార పార్టీ నేతలు చాలా నిర్లక్ష్యంగా మాట్లాడారు. ఆ ఇన్స్యూరెన్స్ డబ్బులు వస్తాయని తెలిసీ, ప్రభుత్వ హడావిడిగా.. ఆ రధం స్థానంలో కొత్త రధాన్ని నిర్మించే ప్రక్రియ ప్రారంభించింది. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి.. కొత్త రధం కూడా తయారయ్యిందిగానీ, రధాన్ని తగలబెట్టిన ‘సంఘ విద్రోహ శక్తుల్ని’ మాత్రం ఇంతవరకూ పట్టుకోలేకపోయారు పోలీసులు.
తప్పు ఎక్కడ జరిగింది.? ఎక్కడ జరుగుతోంది.? ఇదొక్కటే ఇలాంటి ఘటన రాష్ట్రంలో జరిగితే.. అది వేరే సంగతి. కానీ, అంతకు ముందు రాష్ట్రంలో ఇంకో రథం తగలబడింది. చాలా దేవాలయాల్లో దేవతామూర్తుల విగ్రహాల్ని దుండగులు ధ్వంసం చేశారు. తాజాగా, విజయనగరం జిల్లా రామతీర్థం గుడిలో రాములోరి విగ్రహాన్ని ధ్వంసం చేశారు దుండగులు. శతాబ్దాల చరిత్ర కలిగిన రామతీర్థం దేవాలయం, రాష్ట్రంలోనే రెండో అతి ప్రాముఖ్యమైన రాములోరి క్షేత్రంగా విరాజిల్లుతోన్న విషయం విదితమే.
కొన్నాళ్ళ క్రితం ఓ దేవాలయంలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేస్తే, ‘విరిగింది బొమ్మ తాలూకు చెయ్యే కదా..’ అన్నారొక మంత్రిగారు. ఇది, రాష్ట్రంలో ప్రభుత్వ పాలనకు నిదర్శనంగా కనిపిస్తోంది. అక్కడ, హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. కానీ, మంత్రిగారికి మాత్రం.. దేవతా మూర్తుల విగ్రహాలంటే.. జస్ట్ బొమ్మల్లాగా కనిపిస్తున్నాయి. అదే, ముఖ్యమంత్రి మీద ఎవరన్నా విమర్శలు చేస్తే.. ‘ముఖ్యమంత్రి శివలింగం లాంటోడు..’ అంటూ అధికార పార్టీ నేతలు విరుచుకుపడిపోతారు.
ఒకటి కాదు.. రెండు కాదు.. హిందూ ధర్మంపై పనిగట్టుకుని కొందరు దాడికి పాల్పడుతున్న వైనం స్పష్టంగా కన్పిస్తోంది. దాన్ని అధికార పార్టీ నేతలు సమర్థిస్తున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. లేకపోతే, తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడకూడదు.. అన్యమత ప్రస్తావనే వుండకూడదు. కానీ, సాక్షాత్తూ మంత్రి ఒకరు అన్యమత పండుగకి సంబంధించి శుభాకాంక్షలు తిరుమల కొండపై చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.?
‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఏడాదిన్నరగా దేవాలయాలపై దాడులు చేస్తూ, దేవతా విగ్రహాలను, రధాలను ధ్వంసం చేస్తున్న ఘటనలపై కేంద్ర హోంశాఖ దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నాం..’ అంటూ జనసేన అధినేత తాజాగా స్పందించారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఒకదాని తర్వాత ఒకటి.. వరుస ఘటనలు జరుగుతున్న దరిమిలా.. ఏ ఘటన జరిగినా, దానికి సంబంధించి దోషుల్ని రాష్ట్ర పోలీసులు పట్టుకోలేకపోతున్న దరిమిలా.. జనసేన కోరుతున్నట్లుగా.. కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవాల్సిందేనేమో!
అన్నట్టు, అయోధ్య రామ మందిరం నిర్మాణం జరుగుతున్న వేళ.. అంతటి ప్రాశస్త్యం కలిగిన రామతీర్థం దేవాలయంలోని రాములోరి విగ్రహం ధ్వంసమవడమంటే.. ఇది ఏమాత్రం చిన్న విషయం కాదు.. దీన్ని ఖచ్చిరతంగా హిందూ ధర్మంపై జరుగుతున్న దాడిగానే భావించాలి.
872356 873707Admiring the time and energy you put into your weblog and in depth data you offer. Its very good to come across a weblog every once in a although that isnt exactly the same old rehashed material. Amazing read! Ive bookmarked your site and Im adding your RSS feeds to my Google account. 422078
554550 624072I adore your wp design, wherever did you download it by way of? 943142
777638 595397Wow, cool post. Id like to write like this too – taking time and real effort to make a great article but I procrastinate too considerably and never seem to get started. Thanks though. 741593